Andhra Pradesh

News May 10, 2024

శ్రీకాకుళం: రేపే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

News May 10, 2024

గుంటూరు: రేపే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన గుంటూరు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

News May 10, 2024

తిరుపతి చేరుకున్న నాగబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రోడ్‌షో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు శుక్రవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి నాగబాబుకు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఈ రోడ్ షోలో పాల్గొంటారు.

News May 10, 2024

వైసీపీని గెలిపించండి: మంత్రి పెద్దిరెడ్డి

image

శ్రీకాళహస్తిలో శుక్రవారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తి చేశారన్నారు. వచ్చే ఐదేళ్లలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు గతంలో 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు.

News May 10, 2024

VZM: జిల్లాలో 144 సెక్షన్ అమలు.. కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీఆర్‌పీసీ 1973 చట్టం కింద 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. దీని ప్రకారం, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు.

News May 10, 2024

నీ ఇంట్లో నలుగురు లేరా చంద్రబాబు: మంత్రి బొత్స

image

చీపురుపల్లి బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నీ ఇంట్లో నలుగురు లేరా? నువ్వు…నీ కొడుకు.. నీ కొడుకు తోడల్లుడు..నీ బావ లేరా? కుటుంబ రాజకీయాలు నీవి కావా? నీకు ఏంటి స్పెషల్? నువ్వు ఏమైనా దైవ సంభూతిడివా?’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఓడిపోయిన లోకేశ్‌ను తీసుకువచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది నువ్వు కాదా?’ అని ప్రశ్నించారు.

News May 10, 2024

భీమవరం: మద్యం షాపుల వద్ద క్యూ

image

ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి 48 గంటలు పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. దీంతో భీమవరం పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు పోటెత్తారు. ఇప్పటికే దుకాణాలలో మద్యం నిల్వలు చాలా వరకు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.- మీ వద్ద పరిస్థితి ఏంటి..?

News May 10, 2024

జిల్లాలో 94% ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తి: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం 94% పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు. మిగిలిన వారికి ఈరోజు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఓటర్ స్లిప్ తీసుకోని వారు ఓటర్ జాబితాలో పేరు ఉంటే పోలింగ్ రోజు స్లిప్పు తీసుకుని నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, పోలింగ్ కేంద్రం వద్ద వీటికి ఏర్పాటు చేశామన్నారు.

News May 10, 2024

కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం సందర్శించారు. జిల్లాలోని క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతున్న వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటికే ఎన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్ని చోట్ల ఏర్పాటు చేయాలి అనే విషయమై అధికారులను ఆరా తీశారు.

News May 10, 2024

6 నెలల్లో ఇళ్లులు ఇప్పిస్తాం: దామచర్ల

image

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇళ్లు ఇప్పిస్తామని ఒంగోలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల హామీ ఇచ్చారు. ఒంగోలులో జరిగిన ప్రజాగళం సభలో దామచర్ల మాట్లాడుతూ.. కేవలం రెండు రోజులే మిగిలింది. ఈ ఐదుఏళ్లలో గంజాయి బ్యాచుతో మన ఇళ్లపై దాడులు చేయించారు. అభివృద్ధి అడుగంటిపోయింది. నా మీద 23 కేసులు పెట్టారు. మరో 23 రోజుల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు.