Andhra Pradesh

News May 10, 2024

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. గొంతు కోసుకున్న భర్త

image

నంద్యాల పట్టణంలోని పప్పులబట్టి బజార్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. మధ్యాహ్నం ఓ పార్టీ నాయకులు జాకీర్ కుటుంబానికి ఓట్ల డబ్బులు పంపిణీ చేశారు. తన ఓటు డబ్బులు తనకే ఇవ్వాలని భార్యను జాకీర్ బెదిరించాడు. అయినా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో జాకీర్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News May 10, 2024

ఘంటసాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని దాలిపర్రు గ్రామ శివారులో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘంటసాల గ్రామం దిరిశం వాని గూడెంకు చెందిన కొక్కిలిగడ్డ ఇస్సాకు మృతిచెందాడు. మచిలీపట్నం నుంచి ఘంటసాల వస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆటోలో నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఘటనపై ఎస్సై ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 10, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు ఎస్పీ

image

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేట పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం నందు రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.

News May 10, 2024

రేపటి నుంచి 144 సెక్షన్ అమలు: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడటానికి వీలులేదని ఆయన గుర్తు చేశారు. పోలింగ్‌ ముగియడానికి 48 గంటల ముందు నుంచి తమ ప్రచారాన్ని ముగించాలని పోటీదారులకు సూచించారు. అప్పటి నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

News May 10, 2024

నెల్లూరులోనే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 22,650 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈసీ లెక్కల ప్రకారం నెల్లూరు సిటీలో 2,698 మంది, ఆత్మకూరులో 2,611 మంది, ఉదయగిరిలో 2,493 మంది, కావలిలో 3,235 మంది, నెల్లూరు రూరల్‌లో 4,741 మంది, కోవూరులో 2,838 మంది, కందుకూరులో 1,908 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

News May 10, 2024

గిద్దలూరు: ఓటుకు నోటులో ఇద్దరు అరెస్ట్

image

గిద్దలూరు మండలంలోని ముళ్లపాడులో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరిని శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.29,500 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News May 10, 2024

అనంత: ప్రచారం @ మరో కొన్ని గంటలే

image

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరొ కొన్ని గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో కొన్ని చోట్ల డబ్బులతో ఓటర్లను ప్రభాలకు తెరలేసింది.

News May 10, 2024

కొండాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొండాపురం మండలం పి.అనంతపురం దగ్గరలో చిత్రావతి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరుకు చెందిన సి.శివకుమార్(18) శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై తన గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 10, 2024

విశాఖ: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీల నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి విశాఖ నిత్యం వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది.

News May 10, 2024

నెల్లూరు: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున స్టార్ క్యాంపెయినర్ల రాకతో నెల్లూరు వార్తల్లో నిలిచింది. తాజా ఎన్నికల్లో వేమిరెడ్డి కుటుంబంతో పాటు మరికొందరు కీలక వైసీపీ నేతలు టీడీపీలోకి మారడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.