India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్ని రోజులు అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున స్టార్ క్యాంపెయినర్ల రాకతో చిత్తూరు జిల్లా వార్తల్లో నిలిచింది. ఈ సారి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని కూటమి, పట్టు నిలుపుకోవాలని వైసీపీ తహతహలాడుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.
మండల పరిధిలోని కస్తూరిబా హాస్టల్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు మండలం ప్రతికూలంక గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ విజయ్ (35) రోడ్డుపై లారీని ఆపుకొని లారీ టైర్లను చెక్ చేస్తున్నాడు. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పలాస మండలంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం తనను ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు టీడీపీ, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని ఎంపీ సంజీవ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి, మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలకుల ఇసుక దోపిడీ వల్ల సుంకేసుల జలాశయంలో నీటి కొరత ఏర్పడిందని ఆరోపించారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ గౌరీ మణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 08674-295953, 8555 952320 నెంబర్లను సంప్రదించాలన్నారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. ఇప్పటికే చంద్రబాబు, జగన్ జిల్లాలో విస్త్రత పర్యటనలు చేశారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించాల్సిన మాచర్ల పర్యటన రద్దయినట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు అక్కడ భారీ వర్షం కురవడంతో ఆలస్యమైంది. దీంతో నావిగేషన్ అధికారులు మాచర్ల నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో అనుమతులు నిరాకరించారు. బాబు సభ కోసం తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు నిరుత్సాహ పడ్డారు.
‘రాబోయే మూడు రోజులు చాలా కీలకం. పక్కా ప్రణాళిక, పటిష్ఠమైన సూక్ష్మ కార్యాచరణతో ఎన్నికలను విజయవంతం చేయాలి. పండుగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ఉండాలి’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి యం. అభిషిక్త్ కిషోర్ ఎన్నికలలో పాల్గొంటున్న అధికారులు సిబ్బందికి ఉద్బోధించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ నుంచి పలువురు అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్ని రోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి విజయనగరం జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో తూ.గో. జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరోవైపు జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీచేయడంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
Sorry, no posts matched your criteria.