Andhra Pradesh

News May 10, 2024

మనుబోలు జాతీయరహదారిపై ప్రమాదం

image

మనుబోలులోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేగంగా వెళుతున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.   

News May 10, 2024

కృష్ణా: కృష్ణప్రసాద్‌లకు విజయం దక్కేనా

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన, మైలవరంలలో కృష్ణప్రసాద్ కాగిత, కృష్ణప్రసాద్ వసంత టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో దేవినేని ఉమాపై విజయం సాధించిన వసంత ఇటీవల పార్టీ మారి మైలవరం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో టీడీపీ తరఫున పెడన నుంచి బరిలోకి దిగిన కాగిత గెలుపు చవిచూడలేదు. తాజాగా పెడన నుంచి కాగిత, మైలవరంలలో వసంత బరిలోకి దిగుతుండగా ఓటర్లు వీరిని కరుణిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

News May 10, 2024

విజయరామరాజు పేటలో రోడ్డు ప్రమాదం.. రెండో వ్యక్తి మృతి

image

విజయరామరాజుపేట సమీపంలోని బియన్ రోడ్‌లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన <<13222221>>విషయం తెలిసిందే<<>>. విస్సారపు గణేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలయిన మధుని 108 వాహనంలో చోడవరం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో మధు కూడా మృతి చెందాడు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.

News May 10, 2024

మూడు రోజుల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతపై నిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిదని కలెక్టర్ దినేష్ కుమార్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఓలు, ఏపీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

News May 10, 2024

విజయరామరాజు పేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

బుచ్చియ్యపేట మండలం విజయరామరాజుపేట సమీపంలోని బియన్ రోడ్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విస్సారపు గణేశ్, శీలం మధు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చోడవరం ఆసుపత్రికి తరలించారు.

News May 10, 2024

ఏలూరు: ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోం’

image

ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్‌ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

News May 10, 2024

మహానంది: ఈ మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్త

image

నంద్యాల-గాజులపల్లె మార్గంలో చలమ రేంజ్ అటవీశాఖలోని పెద్ద పులులు, ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రయాణీకులు జాగ్రత్తలు పాటించాలని చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు.

News May 10, 2024

ప్రకాశం: మే 13న కార్మిక సంస్థలకు సెలవు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన పోలింగ్ రోజున దుకాణాలు, కార్మిక సంస్థలకు ఈసీ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లుగా జిల్లా ఉపకార్మిక కమిషనర్ శ్రీనివాస కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వేయటానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక దుకాణాల చట్టం అనుసరించి నిబంధనలు పాటించాలన్నారు.

News May 10, 2024

భీమవరంలో అమిత్‌షా రోడ్ షో రద్దు

image

భీమవరంలో రేపు జరగవలసిన బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్‌షో రద్దయింది. షా బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమం రద్దయినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

News May 10, 2024

ముస్లింలకు అండగా ఎన్డీఏ కూటమి: చంద్రబాబు

image

ముస్లిం మైనార్టీలకు అండగా ఎన్డీఏ కూటమి ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.