India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరులోని సీఐఏ క్రికెట్ అకాడమీ మైదానంలో జిల్లా జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అండర్-19 బాలురు, మధ్యాహ్నం 3 గంటలకు అండర్-15, 19 బాల, బాలికల జట్లు ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నిఖిలేశ్వర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఏసీ స్టేడియంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఉండిలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్లో ఉండి ప్రధాన వంతెన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు కోరారు.
నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడికి హైదరాబాద్కు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. నెల్లూరులోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం పెళ్లి చేసేందుకు రూ.లక్షల ఖర్చుతో అన్ని ఏర్పాట్లు చేశారు. వధువు వైపు వారు మండపానికి చేరుకున్నారు. ఎంతసేపయినా వరుడితో పాటు కుటుంబసభ్యులు రాలేదు. వాళ్ల ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి కన్నీటి పర్యంతమయ్యారు.
ఓటర్లకు డబ్బులు పంచుతున్న నలుగురిని గురువారం మహారాణిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దండు బజారులో ఓ వ్యక్తి నుంచి రూ.50,000. సాలిపేటలో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1,08,168లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
2014, 2019లో తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున గెలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తాజా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన పోలైన ఓట్లలో 50.73% ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి KS జవహర్పై 10,835 ఓట్ల మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో రక్షణనిధిని కాదని, వైసీపీ నల్లగట్ల స్వామిదాసుకు టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
నెల్లూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. నెల్లూరు సిటీలో 2698, ఆత్మకూరులో 2611, సర్వేపల్లిలో 1397, ఉదయగిరిలో 2493, కావలిలో 3235, నెల్లూరు రూరల్లో 4741, కోవూరులో 2838, కందుకూరులో 1908 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు 2150 మంది ఓటు వేశారు.
అనంత జిల్లా కంబదూరు మండలంలోని కదిరిదేవరపల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అచ్చంపల్లికి చెందిన వాలంటీర్ ఉప్పర తిమ్మరాజు(26) మృతిచెందాడు. కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన టాటా సుమో ఢీకొంది. ప్రమాదంలో తిమ్మరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వజ్రపుకొత్తూరు మండలం ఉండ్రుకుడియా గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొత్స షణ్ముఖరావు, గ్రామ వాలంటీర్ సహాయంతో బుధవారం రాత్రి వైసీపీ ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక యువకులు ప్రశ్నించి, ఫొటోలు తీయడంతో.. వారిపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదుతో కాశిబుగ్గ పోలీసులు ఉపాధ్యాయుడుతో పాటు వాలంటీర్ తోట దిలీప్పై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో రెండు నగరాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి . ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ. అన్ని విధాలా చైతన్యం కలిగిన జిల్లా. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ పెద్దగా పోలింగ్ జరగడంలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 74.64శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2019లో 79శాతం పోలింగ్ జరిగింది. ఈ సారి కనీసం 85 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.