Andhra Pradesh

News June 29, 2024

విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి.సాయి క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తిని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్.అంబేద్క‌ర్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. జిల్లా న్యాయస్థానంలోని ఆయన ఛాంబర్‌లో కలిసి, పూలగుచ్ఛాన్ని అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం కొద్దిసేపు జిల్లాకు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. ఆర్‌డిఓ ఎం.వి.సూర్య‌క‌ళ కూడా తదితర సిబ్బంది పాల్గొన్నారు.

News June 29, 2024

విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన: మంత్రి లోకేశ్

image

ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేశ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

News June 29, 2024

నెల్లూరు: వీవీ ప్యాట్లలో పేపర్ రోల్స్ తొలగింపు

image

నెల్లూరులోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఇటీవల ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్ మెషిన్లలో మిగిలిన పేపర్ రోల్స్ తొలగించారు. అనంతరం వీవీ ప్యాట్లను యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవిన్యూ అధికారులు చేపట్టారు.

News June 29, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.

News June 29, 2024

డైట్‌లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్: ప్రిన్సిపల్

image

డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్‌ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.

News June 29, 2024

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: ఆర్జేడీ

image

ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ విజయ భాస్కర్ అన్నారు. పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడి బయట పిల్లలు బడికి వచ్చే చర్యలు చేపట్టాలని అందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమయపాలన ఎంఈఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

News June 29, 2024

విజయనగరం: ఆన్‌లైన్‌లో గురుకుల పరీక్ష ర్యాంక్ కార్డులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డులు ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆ పాఠశాలల జిల్లా కన్వీనర్ రమామోహిని తెలిపారు. 1:2 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తామన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థులు జూలై 2, 3 తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

News June 29, 2024

శ్రీకాకుళం: ఇంజినీరింగ్ కోర్సు దరఖాస్తుల పరిశీలన

image

RGUKT లో ఆరేళ్ల సమీకృత B.TECH ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి శ్రీకాకుళం క్యాంపస్‌కు సంబంధించి జులై 26, 27వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని డైరెక్టర్ కె.బాలాజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారని అడ్మిషన్స్ కన్వీనర్ ఎస్.అమరేంద్ర కుమార్ శుక్రవారం వెల్లడించారు. అభ్యర్థులు గమనించాలని సూచించారు.

News June 29, 2024

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోండి: ఏఎస్పీ

image

జులై 1వ తేదీ నుంచి నూతన చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై పుట్టపర్తి కోర్ టీంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై పోలీసు అధికారులు పూర్తిగా పట్టు సాధించాలన్నారు.

News June 29, 2024

విద్యార్థులకు పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి: కలెక్టర్

image

పాణ్యం మండలం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరు అయిన విద్యార్థులు, హాజరు పట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.