Andhra Pradesh

News May 10, 2024

ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసాం: కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈనెల 13 న రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.

News May 10, 2024

అనకాపల్లి: ఎన్నికల ప్రక్రియపై ట్రైనీ ఐపీఎస్‌లకు అవగాహన

image

ఎన్నికల ప్రక్రియపై నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి వచ్చిన తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్‌లకు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు.

News May 10, 2024

రాజమండ్రి: చంద్రబాబు కుట్రలకు మోసపోవద్దు: భరత్

image

మోసపు మాటలతో ప్రజలను నమ్మించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు పన్నే కుట్రలకు ఎవరూ మోసపోవద్దని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 2, 10వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు.
– భరత్ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

News May 10, 2024

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి: బాలాజీ

image

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు విలువైనదని గుర్తించి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అప్రమత్తమై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

News May 10, 2024

గుంటూరు: జిల్లాలో రూ.3,64,11,311ల నగదు స్వాధీనం

image

జిల్లాలో గురువారం ప్లయింగ్ స్క్వాడ్‌లు నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.42,500/-ల నగదు, మంగళగిరి పరిధిలో రూ.87,500/ల నగదు, గుంటూరు తూర్పు పరిధిలో రూ. 2,96,500 ల నగదు, తాడికొండ పరిధిలో రూ.35,000ల విలువ గల వస్తువులు సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఇప్పటి వరకు రూ.3,64,11,311/ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.

News May 9, 2024

కర్నూలు జిల్లాలో 11వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్

image

ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సృజన సంబంధిత అధికారులను గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి అధికారులు మద్యంపై నిఘా ఉంచాలన్నారు.

News May 9, 2024

విశాఖలో కూటమి అభ్యర్థులను పరిచయం చేసిన చంద్రబాబు

image

ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. విశాఖ నగరం ద్వారక నగర్‌లో నిర్వహించిన సభలో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్, తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్, పశ్చిమ అభ్యర్థి గణబాబును పరిచయం చేశారు.

News May 9, 2024

నరసరావుపేట: ‘ఓటర్లుకు లైటింగ్ సదుపాయం చేయాలి’

image

వెయ్యి మంది ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లలో లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్‌ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంబంధించి ఖర్చుల బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. 

News May 9, 2024

బాదుడు లేని సంక్షేమం అందిస్తాం: చంద్రబాబు

image

వైసీపీ అవినీతి, అరాచక, దోపిడి ప్రభుత్వానికి మే 13న ప్రజలు ఉరి వెయ్యాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేం అధికారంలోకి రాగానే బాదుడు లేని సంక్షేమం అందిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News May 9, 2024

గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం

image

పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉందని, వెనిగండ్ల రాము గెలిస్తే, గుడివాడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గుడివాడలో అవకాశాలు లేకపోవడంతో తన లాంటి వారి అందరూ పక్క రాష్ట్రానికి వెళ్లి స్థిరపడ్డారన్నారు.