India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్లు రాజీనామా చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

హిందూపురం ఎంపీ బి.కే పార్థసారథిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆమె ఎంపీతో చర్చించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ గల్లా మాధవికి సూచించారు. ఈ కార్యక్రమంలో గల్లా రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్లు రాజీనామా చేశారు. ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం B.Tech 7వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఫలితాల కోసం https://drbrau.in ను సందర్శించాలని ఎగ్జామినేషన్ డీన్ కోరారు.

మార్కాపురం జిల్లా ప్రకటనపై ఊహాగానాలు వస్తున్న సందర్భంగా మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురంను ప్రత్యేక జిల్లాను చేస్తామని ప్రకటించారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో మార్కాపురంను జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం 38,744 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం, బలిజిపేట మండలాలలో 27 గ్రామాలకు చెందిన 13,684 ఎకరాలకు, విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం నియోజకవర్గాలలోని 13 మండలాలలో 66 గ్రామాలకు చెందిన 25,060 ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు.

రెబల్స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్

జిల్లా మీదుగా నడుస్తున్న అహ్మదాబాద్-తిరుచునాపల్లి, మధురై -ఓకా రైళ్ల గడువును పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. అహ్మదాబాద్ నుంచి తిరుచునాపల్లికి వెళ్లే రైలును సెప్టెంబర్ 26వరకు, తిరుచునాపల్లి నుంచి అహ్మదాబాద్కు వెళ్లే రైలును సెప్టెంబర్ 29 వరకు, ఓకా, మధురై మధ్య నడుస్తున్న రైలు గడువును సెప్టెంబర్ 30 వరకు, మధురై- ఓకా రైలును అక్టోబర్ 4 వరకు పొడిగించారు.

జిల్లా లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి గ్రూప్-4, టెక్నికల్, క్లాస్-4 పోస్టుల అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకాశం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీలోగా జాబితాను పరిశీలించుకోవాలని కోరారు.

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకై ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) ఈసెట్-2024 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషన్లు కావలసిన విద్యార్థులు ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
Sorry, no posts matched your criteria.