India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్ ఖాసిమి కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖాసిమి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్ ఉలమ ఏ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించామని చెప్పారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి, బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ రేపు శుక్రవారం మచిలీపట్నం రానున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. NDA కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ఎన్డీఏ విజయ శంఖారావానికి నాంది పలుకుతూ భూపేంద్ర నిర్వహించే ప్రచారానికి స్థానికులు హాజరుకావాలని స్థానిక బీజేపీ నేతలు కోరారు.
చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య మనమడు పోలిశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల నుంచి తప్పుకున్నాడు. చీరాల నుంచి గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్గా పోటీకి దిగిన శ్రీనివాసరావు గురువారం వైదొలగి TDP అభ్యర్థి మాలకొండయ్యకు మద్దతు ప్రకటించారు. శ్రీనివాసరావుకు కొండయ్య కండువా కప్పి TDPలోకి స్వాగతం పలికారు. చేనేతల వికాసానికి కొండయ్య హామీ ఇచ్చినందున తాను సంతృప్తి చెంది పోటీ నుంచి తప్పుకున్నట్లు పోలిశెట్టి చెప్పారు.
జిల్లాలో ఆలయాల కౌలు భూముల పన్నులకు సంబంధించి నకిలీ రసీదుల బాగోతం బయటపడింది. నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వరాలయం ఈవో సుకన్య వివరాల మేరకు గుడివీధిలోని ఆలయ భూములకు రెండేళ్లుగా శిస్తు చెల్లించడం లేదని ఏడుగురు రైతులకు నోటీసులు ఇవ్వగా, వారు శిస్తు చెల్లించామన్నారు. అధికారులు విచారణ చేపట్టగా అటెండర్గా పనిచేసిన సతీశ్ నకిలీ రసీదులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. అతడిని సస్పెండ్ చేశామని ఈఓ తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని అల్లూడిలో గురువారం విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కందపల్లి గ్రామానికి చెందిన శీనప్ప విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం ఎక్కగా షాక్కు గురయ్యాడు. లైన్మెన్ ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓల కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో 8 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.
తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా సంఘటనలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో తాజా ఎన్నికలపై తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి అదితిసింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఫేక్ ఓటరని గుర్తిస్తే.. సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
TDP అధినేత నారా చంద్రబాబు రేపు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆయన ఒంగోలుకు చేరుకుంటారు. అనంతరం నగరంలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 11వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లా, పూతలపట్టుకు వెళ్తారు. దీంతో దామచర్ల జనార్దన్కు సమాచారం అందగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొదటగా చంద్రబాబు 11వ తేదీ ఒంగోలుకు రావాలి. కానీ ఆయన పర్యటన ఒక రోజు ముందుకు మారింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఆర్.వి.మురళీ కృష్ణ తెలిపారు.
వెంకటగిరి, తిరుపతిలోని కాలేజీలకు జూన్1లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కొండ దిగువన ఓటు హక్కు వినియోగానికి సంబంధించి రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. ఈ సరికొత్త శిల్పం రూపొందించిన శిల్పి గేదెల హరికృష్ణ గురువారం మాట్లాడుతూ.. భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు విధిగా తమ ఓటు హక్కును సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకోవాలని సూచించారు. హరికృష్ణను పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.