India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఇంటర్ విద్యామండలి శుక్రవారం వరకు పొడిగించింది. ఈ మేరకు మండలి తిరుపతి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెలలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగియగా, రెండు రోజులు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని రాజమహేంద్రవరం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐసీహెచ్వీఎస్ నరసింహం బుధవారం తెలిపారు. అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు పదో తేదీ వరకు మాత్రమే గడువు ఉందన్నారు. తత్కాల్ స్కీంలో ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఎన్నికల కమిషన్ మరో చాన్స్ ఇస్తూ, ఒక రోజు పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్కు అవకాశం కల్పించింది. జిల్లాలో 19,050 మంది అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి 17,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలను జీపీఎస్ సౌకర్యం ఉన్న వాహనాల్లోనే తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ జిల్లాకు కేటాయించిన శిక్షణ ఐపీఎస్లు నెల్లూరుకు చేరుకున్నారు. వీరిలో మయాంక్ మిశ్రా, సిద్ధార్థ్, రామ్ కుమార్, ప్రతీక్ సింగ్, కుష్ మిశ్రా, సూరజ్, అభినవ్ ద్వివేది, జామా సోనార్, ఆషిమా నాశ్వాణి, అపర్ణ ఉన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓటర్లను రప్పించడానికి ఆయా పార్టీల అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కొందరికి వాహనాలు ఏర్పాటు చేయగా.. మరికొందరికి వారి ఖాతాలోనే నగదు వేసి ఓటు వేయాలని కోరుతున్నారు. మరోవైపు ఓటుకు నోటు ఇవ్వడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. రేపటి నుంచి ఓటర్లకు నగదు ఇవ్వడానికి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నాయకులు ఓటర్లను జోరుగా ప్రభావితం చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నిన్న కలికిరిలో మోదీ సభ జరగడంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పలు పార్టీలు జోరుగా నగదు పంపిణీ చేశాయని సమాచారం. మీ ఏరియాలో ఓటుకు డబ్బు ఇచ్చారో లేదో కామెంట్ చేయండి.
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో కలిపి మూడు రోజులు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉండటంతో సీఎం జగన్ సుడిగాలి ప్రదర్శన చేపట్టారు. దానిలో భాగంగానే నేడు మధ్యాహ్నం 3 గంటలకు జగన్ రాజంపేటకు రానున్నారు. రైల్వేకోడూరు రోడ్డులో ఎన్నికల ప్రచార సభ ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. దీంతో జగన్ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్ఓ కార్యాలయం ముందు స్వతంత్ర అభ్యర్థి నాగరాజు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికలు రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో అర్ధనగ్న ప్రదర్శన విరమించారు.
రేపు జరిగే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని మొదటిగా అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన విజయనగరం గజపతిరాజులకే కల్పిస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులతో పాటు న్యాయమూర్తులు, పట్టు వస్త్రాలు సమర్పించే దేవాదాయ శాఖ అధికారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్య సేవకులు, విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తారు.
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఈనెల 9 నుంచి జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త, తెనాలి ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఆన్లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని, వివరాలకు జిల్లాలోని ఐటీఐల్లో సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.