Andhra Pradesh

News June 28, 2024

వసతులపై నివేదిక ఇవ్వండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై జులై 7వ తేదీ లోపు నివేదిక అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలోని R&B గెస్ట్‌హౌస్‌లో సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో నివేదిక తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.

News June 28, 2024

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష

image

మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అప్పు విషయంలో మహిళతో దుర్భాషలాడి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన శివ నాగమణి, శ్రీనివాసరెడ్డిలకు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించిందని తెలిపారు. 

News June 28, 2024

పింఛన్ దారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండండి: కీర్తి చేకూరి

image

జులై 1వ తేదీన నగరంలో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నట్లు జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. జులై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి వార్డు సచివాలయాల వారిగా పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. పింఛనుదారులు తమ ఇంటి వద్దకు పింఛను అందించడానికి వచ్చే సచివాలయ కార్యదర్శులకు అందుబాటులో ఉండి సహకరించాలని కమిషనర్ కోరారు.

News June 28, 2024

సత్యసాయి: ఇంటి వద్దకే పింఛన్లు

image

జూలై 1న ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. శనివారం బ్యాంకుల ద్వారా అధికారులు నగదు విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.

News June 28, 2024

30న కోవెలకుంట్లకు మంత్రి బీసీ రాక

image

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 30న కోవెలకుంట్ల మండలంలో పర్యటించనున్నట్లు బీసీ రామనాథరెడ్డి తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గం చరిత్రలో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కోవెలకుంట్ల మండలానికి రానున్నారు. దీంతో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 28, 2024

మద్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి: ఆర్జీడీ

image

మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి.విజయభాస్కర్ సూచించారు. విజయనగరం డీఈఓ ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేటట్లు ప్రోత్సహించాలన్నారు. భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు. అకాడమిక్ విషయాలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఈవో ప్రేమకుమార్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

News June 28, 2024

పాడేరు: లొంగిపోయిన మహిళా మావోయిస్టులు

image

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

News June 28, 2024

సోంపేట: నాటుసారా తయారీని అరికట్టేందుకు దాడులు

image

సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జై భీమ్ సిబ్బందితో కలిసి మందస మండలంలోని కొండలోగాం పంచాయతీలోని నాటుసారా తయారీని అరికట్టేందుకు గురువారం సాయంత్రం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అనంతరం గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు.

News June 28, 2024

కడప: పెన్షన్ల పంపిణీ పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో జులై 1, 2 తేదీల్లో చేపట్టనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, డిఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, జిఎస్ డబ్ల్యుఓ ఏవో లక్ష్మీపతి, తదితర అధికారులు పాల్గొన్నారు.

News June 28, 2024

ఇరిగేషన్ అంశాలపై మంత్రి నిమ్మల చర్చ

image

గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్‌తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.