Andhra Pradesh

News May 9, 2024

తాడేపల్లిగూడెం:31 ఓట్లతోనే MLAగా గెలిచింది ఈమే..!

image

తాడేపల్లిగూడెం అసెంబ్లీకి ఉపఎన్నికలతో పాటు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధిక,అత్యల్ప మెజార్టీ చూస్తే..1987లో TDP అభ్యర్థి పి.కనక సుందరరావుపై ఐ.కాంగ్రెస్ అభ్యర్థి ఈలి వరలక్ష్మి 31 అత్యల్ప ఓట్లతో గెలిచారు.1983లో జరిగిన ఉపఎన్నికలలో ఐ.కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్.ఆర్ భాస్కరరావుపై TDP అభ్యర్థి ఈలి ఆంజనేయులు 42,694వేల అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మీ నియోజకవర్గంలో గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 9, 2024

శ్రీకాకుళం అత్యధిక.. అత్యల్ప మెజార్టీ ఓట్లు వీరికే.!

image

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థుల అత్యధిక, అత్యల్ప మెజార్టీలను గమనిస్తే.. 1971 కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి.రాజగోపాలరావుకు వచ్చిన 1,37,461 ఓట్ల మెజార్టీనే అత్యధికం. 1952లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వివి.గిరికి వచ్చిన 6395 ఓట్ల మెజార్టీనే అత్యల్పం. – మరి ఈసారి గెలుపు, మెజారిటీపై మీ COMMENT..?

News May 9, 2024

విజయవాడ సెంట్రల్‌లో అత్యధిక.. అత్యల్ప మెజారిటీ ఓట్లు వీరికే.!

image

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థుల అత్యధిక, అత్యల్ప మెజార్టీలను గమనిస్తే.. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన బొండా ఉమాకు వచ్చిన 27,161 ఓట్ల మెజార్టీనే అత్యధికం. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణుకు వచ్చిన 25 ఓట్ల మెజార్టీనే అత్యల్పం. – మరి ఈసారి గెలుపు, మెజారిటీపై మీ COMMENT..?

News May 9, 2024

తూ.గో: ఈ నెల 11 నుంచి మూతపడనున్న మద్యం షాపులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం ప్రియుల్లో హైరానా మొదలైంది. దీంతో ఇప్పటి నుంచే మందుబాబులు జాగ్రత్త పడుతున్నారు. కాకినాడ జిల్లాలో 157 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. తూ.గో జిల్లాలో 145 మద్యం దుకాణాలు, 27 బార్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 100 మద్యం దుకాణాలు, ఆరు బార్లు ఉన్నాయి.

News May 9, 2024

నేడు కురుపాం, చీపురుపల్లిలో చంద్రబాబు సభలు

image

చంద్రబాబు నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:25‌కు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో 10:35గం.కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో 11:30గంటలకు కురుపాం చేరుకుంటారు. అనంతరం రావాడ జంక్షన్‌‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. భోజనం అనంతరం హెలికాప్టర్‌లో చీపురుపల్లిలో జరిగే సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత విశాఖ సభలో పాల్గొంటారు.

News May 9, 2024

ఒంగోలు : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు మరో ఛాన్స్

image

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఎన్నికల కమిషన్ మరో చాన్స్‌ ఇస్తూ, ఒక రోజు పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్‌కు అవకాశం కల్పించింది. జిల్లాలో 19,050 మంది అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి 17,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 9, 2024

13న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఈనెల 13న తిరుపతి స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించారు. వైద్యులు, సిబ్బంది, రోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ఇచ్చారు. ఆరోజు అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయని సంచాలకులు డా.ఆర్వీ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

News May 9, 2024

NLR: ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులు

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 9 నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియతో పాటు ఏ సందేహం ఉన్నా వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని కోరారు.

News May 9, 2024

ప.గో :11 నెలల తర్వాత నేటి నుంచి దర్శనాలు

image

వైశాఖ మాసం ప్రారంభం నేపథ్యంలో నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం తలుపులు తెరవనున్నట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. నేటి నుంచి జూన్ 6 వరకు స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఏడాదిలో 11 నెలలు నీటిలో ఉండే స్వామి కేవలం వైశాఖ మాసం నెలరోజులు భక్తులకు దర్శనమిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఆర్. గంగా శ్రీదేవి చెప్పారు.

News May 9, 2024

తోట్లవల్లూరు మండలం నుంచి ముగ్గురు MLAలు

image

తోట్లవల్లూరు మండలం ముగ్గురు ఎమ్మెల్యేలను అందించింది. పెనమకూరుకు చెందిన మైనేని లక్ష్మణస్వామి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 1952, 1964లో ఎమ్మెల్యే అయ్యారు. రొయ్యూరుకు చెందిన చాగర్లమూడి రామకోటయ్య 1955లో కంకిపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే మండలంలోని ఐలూరుకు చెందిన కడియాల వెంకటేశ్వరరావు 1967లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.