India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రదేశాలలో 800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మే 13న జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనుందని అన్నారు. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామన్నారు.
ఇటీవల పర్చూరు ఆర్వో కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎస్ఐ నాగశివారెడ్డి టీడీపీ నేతను బూతులు తిట్టారని ఏప్రిల్ 23న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై ఎస్పీ ఆదేశాలతో బాపట్ల డీఎస్పీని విచారణ చేపట్టి ఇచ్చిన నివేదికతో ఎస్ఐ నాగశివారెడ్డిపై వేటు పడింది. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ బుధవారం ఎస్ఐని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.
కేవలం రూ.30 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న శివశక్తి డెయిరీపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం తగదని మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పుంగనూరులో హెరిటేజ్తో పాటు అన్ని కంపెనీల డెయిరీలు పాలు సేకరిస్తున్నాయి. పాడి, మామిడి రైతులకు మా నుంచి ఇబ్బందులు ఎదురై ఉంటే ఎన్నికల్లో మాకు ఓట్లు వేయకండి’ అని మిథున్ రెడ్డి సూచించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 10న పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. కాగా అదే రోజు సీఎం జగన్ సభ ఉండడంతో మొదట అనుమతికి ఇవ్వడానికి ఆలోచించిన అధికారులు జగన్ సభ వాయిదా పడడంతో పవన్కు అనుమతి ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్ షో ఉండనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.
రేపు జరిగే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని మొదటిగా అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన విజయనగరం గజపతిరాజులకే కల్పిస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులతో పాటు న్యాయమూర్తులు, పట్టు వస్త్రాలు సమర్పించే దేవాదాయ శాఖ అధికారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్య సేవకులు, విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తారు.
2024-25 విద్యా సంవత్స రానికి సంబంధించి గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల ఉన్నత విద్యకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి రంగ లక్ష్మిదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కాలర్షిప్ పొందేందుకు మాస్టర్ లెవెల్ పీహెచ్ఏ, పోస్టు డాక్టరల్ రీసర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి అరుణకుమారి తెలిపారు. ఈ సమయంలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా సీజ్ చేస్తామన్నారు. వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-ఖుర్దా రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం కె.సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-ఖుర్దా రోడ్డు మధ్య ఈనెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి దువ్వాడ మీదుగా ఖుర్దా రోడ్డు చేరుకుంటుందన్నారు. 11వ తేదీ రాత్రి 7.17 గంటలకు ఖుర్దా రోడ్డులో బయలుదేరి దువ్వాడ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.
సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్ బ్యాటరీల రక్షణ విషయంలో కలెక్టర్ మల్లికార్జున జోక్యం చేసుకోవాలని బుధవారం స్టీల్ ప్లాంట్ సీఎండీ భట్ విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేయాలని జారీ చేసిన హైకోర్టు ఆదేశాలు అమలుకు నోచుకోలేదన్నారు. గంగవరం పోర్ట్ యజమాన్యం బొగ్గు రవాణాకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. బొగ్గు అందుబాటులో లేక ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు.
కడప జిల్లాలో YS కుటుంబాన్ని మెజారిటీ ప్రజలు అభిమానిస్తారనేది కాదనలేని సత్యం. అలాంటి కుటుంబంలో రాజకీయ విభేదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. వైఎస్సార్ వారసులు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఇది ఎంత వరకు వెలుతుందని అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంట్లో సమస్యలను బయటపెట్టుకోవడంతో ప్రత్యర్థులకు చులకనగా కనిపించడం తప్ప మరొకటి లేదని ప్రజలు బహిరంగంగానే అంటున్నారు.
Sorry, no posts matched your criteria.