Andhra Pradesh

News June 27, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 27, 2024

గౌరు చరితా రెడ్డిని కలిసిన సినీ నటుడు రాజకుమార్

image

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులను సినీ నటుడు నటుడు రాజకుమార్ కలిశారు. కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.

News June 27, 2024

గిద్దలూరు: ఎట్టకేలకు.. చిక్కిన చిరుత

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని దేవనగరం గ్రామ సమీపంలోని గోతిలో చిక్కుకున్న చిరుతను 24 గంటలు శ్రమించి ఎట్టకేలకు అధికారులు బంధించారు. ఫీల్డ్ డైరెక్టర్ డీఎన్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు చిరుతను అటవీశాఖ అధికారులు గురువారం తరలించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుచుకున్నారు.

News June 27, 2024

కడప: 29 న జాతీయ మెగా లోక్ అదాలత్

image

జిల్లావ్యాప్తంగా ఈనెల 29న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జస్టిస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు జస్టిస్ శ్రీదేవి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 27, 2024

ప్రకాశం: లోక్ అదాలత్‌ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ చేయగలిగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్‌తో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

News June 27, 2024

అనంతపురం: దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.

News June 27, 2024

VZM: షాపులో కాటేసిన పాము.. మహిళ మృతి

image

గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామానికి చెందిన అట్టాడ లక్ష్మి గురువారం పాముకాటుకు గురై మృతి చెందింది. లక్ష్మి గ్రామంలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవన ఉపాధి పొందుతుంది. గురువారం ఎప్పటిలాగే షాపు తెరచి తన పనిలో నిమగ్నమవ్వగా.. అప్పటికే షాపులో ఉన్న పాము లక్ష్మిని కాటు వేసింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది.

News June 27, 2024

నెల్లూరులో లాయర్ల ఆందోళన

image

జులై 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న మూడు కొత్త క్రిమినల్​ చట్టాలను వాయిదా వేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో లాయర్లు నిరసన తెలిపారు. సీనియర్ లాయర్లు జక్కా శేషమ్మ, DSV ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్త చట్టాల కారణంగా IPC 1973, భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

News June 27, 2024

పాడేరు: లొంగిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులు

image

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

News June 27, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖపట్నంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను స్పెషల్ పోక్సో కోర్ట్ న్యాయమూర్తి విధించారు. 2021 సంవత్సరంలో ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల ⁠బాలికపై పక్కింటి వ్యక్తి అప్పన్న అఘాయిత్యం చేశాడు. నిందితుడికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ.. బాలికకు రూ.3లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.