India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా న్యూ టిన్సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

నగరంలో లాలాపేట పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 16న పల్నాడు బస్టాండ్ కెనరా బ్యాంక్ పక్కన సుమారు (40) సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి పడిపోయి ఉండగా 108లో గుంటూరు జీజీహెచ్లో చేర్పించగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసినవారు స్టేషన్లో సంప్రదించాలని పేర్కొన్నారు.

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS)పరీక్షలో ఎంపికై స్కాలర్షిప్ అందని విద్యార్థులు వెంటనే తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానించాలని డీఈవో సుభద్ర తెలిపారు. 2019, 20, 21, 22 సంవత్సరాల్లో ఉపకార వేతనానికి ఎంపికై స్కాలర్షిప్ జమ కాని విద్యార్థుల జాబితా వెబ్సైట్లో పెడతామన్నారు. హెచ్ఎంలు ఆయా విద్యార్థుల బ్యాంక్ అకౌంటుకు ఆధార్ అనుసంధానించేలా చూడాలన్నారు.

ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో మే- 2024లో నిర్వహించిన MSC (హోమ్ సైన్స్)నాలుగవ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా DSC ద్వారా 651 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఇలా..
➤ పీడీలు: 107 ➤ బయాలజీ: 19
➤ ఇంగ్లిష్: 56 ➤ హిందీ: 38 ➤ గణితం: 60
➤ ఫిజిక్స్: 52 ➤ సోషల్ స్టడీస్: 38
➤ సంస్కృతం: 3 ➤ తెలుగు: 32
➤ ఎస్జీటీ తెలుగు: 182 ➤ ఎస్జీటీ ఉర్దూ: 11
➤ సైన్స్: 23

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే ఏదో జిల్లాలు అభివృద్ధి పథంలో నడిపేందుకు అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ప్రజాధనం దుర్వినియోగం చేసి పెద్ద పెద్ద కార్యాలయాల భవనాలు కడతారని అనుకోలేదనీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి రాయచోటిలోని వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి నిధులను ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 46,743 ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 24,753 ఎకరాల్లో జీడి, 5,315 ఎకరాల్లో మామిడి, 16,675 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు వంటివి పండిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల వాతావరణం చల్లగా మారింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. చిటపట చినుకులు కురిపించేందుకు నల్లటి మేఘాలు సిద్ధంగా ఉన్నట్లు చూపరులకు అనిపిస్తోంది. అందమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుండగా మహానంది సమీపంలో ఓ నెటిజన్ క్లిక్ మనిపించిన దృశ్యం ఆకట్టుకుంటోంది.

తనను కలిసేందుకు వస్తున్న వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక సూచన చేశారు. ‘నిత్యం చాలా మంది కలిసేందుకు వస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అయితే నా దగ్గరకు వచ్చే వారు పూల బొకేలకు బదులుగా నోటు బుక్స్, శాలువాలకు బదులుగా టవల్స్ వంటివి తీసుకొస్తే అవి పేదలు, విద్యార్థులకు ఉపయోగపడతాయి. మనం చేసే పని పది మందికి మేలు చేయాలనేది నా ఉద్దేశం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.