Andhra Pradesh

News March 17, 2024

ప్రకాశం: గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

image

రేపు నిర్వహించనున్న గ్రూప్ -1 స్క్రీనింగ్ టెస్ట్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 9 కేంద్రాల్లో మొత్తం 6,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష రోజున జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు.

News March 17, 2024

ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల: కలెక్టర్ ఢిల్లీరావు

image

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా నేడు జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజ‌య‌వాడ పార్ల‌మెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు శనివారం తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 

News March 17, 2024

గుంటూరు: ‘ఉద్యోగులు పార్టీలకు అనుకూలిస్తే చర్యలు’

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుంచి అమలులో ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం కమీషనర్ తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీల నిర్వహించే ప్రచారాలలో పాల్గొన్నా.. ఎన్నికల నిబంధన ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 17, 2024

నేతల ఫ్లెక్సీలను తొలగించండి: విజయనగరం కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమై ఎన్నికల నేపథ్యంలో ఆయా శాఖలు పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలిచ్చారు. నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడంలో ముమ్మరంగా పనిచేయాలన్నారు.

News March 17, 2024

అనకాపల్లి: ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం’

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి, ఎస్పీ కేవీ మురళీ కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి వ్యాప్తంగా 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల వరకు నగదు క్యారీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

News March 16, 2024

శ్రీకాకుళం: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

image

జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్  స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News March 16, 2024

ప.గో జిల్లా పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు

image

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలలో భరోసా కల్పించేందుకు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా పోలీసులు పాల్గొన్నారు.

News March 16, 2024

విజయనగరం: ‘విద్యుత్ చౌర్యం చేస్తే సమాచారం అందించండి’

image

విద్యుత్ నిఘా శాఖ, DPE అధికారులు విజయనగరం సర్కిల్ పరిదిలో పలు ప్రాంతాల్లో సంయుక్తంగా దాడులు చేసినట్లు విద్యుత్ విజిలెన్స్ విజయనగరం సర్కిల్ సీఐ కె. కృష్ణ శనివారం తెలిపారు. తెర్లాం మండలం బూరిపేట, మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామాలలో విద్యుత్ చౌర్యం చేస్తున్న నిందితుల నుంచి 1,03,548 అపరాద రుసుం, రూ.10వేలు జరిమానా విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సమాచారం తెలిస్తే 08922-234579కి తెలియజేయాలన్నారు.

News March 16, 2024

అనంత: ‘ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేయాలి’

image

అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పోస్టర్లను, ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News March 16, 2024

ఎన్నికల నియమావళి అమలు: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించడం జరుగుతుందన్నారు.