India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం కేసును బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో 36 గంటల్లోనే ఛేదించారు. ఆ కేసును త్వరితగతిన ఛేదించడంలో కృషి చేసిన 21 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. క్లూస్ లేనప్పటికీ, కేసును సవాల్గా తీసుకొని త్వరితగతిన ఛేదించారని అన్నారు.
ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణచక్రవర్తిని, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానంలోని ఆయన ఛాంబర్లో కలిసి, పూలగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొద్దిసేపు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్డిఓ ఎం.వి.సూర్యకళ కూడా తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేశ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.
నెల్లూరులోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఇటీవల ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్ మెషిన్లలో మిగిలిన పేపర్ రోల్స్ తొలగించారు. అనంతరం వీవీ ప్యాట్లను యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవిన్యూ అధికారులు చేపట్టారు.
డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.
ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ విజయ భాస్కర్ అన్నారు. పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడి బయట పిల్లలు బడికి వచ్చే చర్యలు చేపట్టాలని అందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమయపాలన ఎంఈఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డులు ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆ పాఠశాలల జిల్లా కన్వీనర్ రమామోహిని తెలిపారు. 1:2 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలుస్తామన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థులు జూలై 2, 3 తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.