India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురానికి చెందిన రామకృష్ణ, సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉత్తర దక్షిణ నియోజకవర్గాల్లో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన ఖరారు అయిందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు. 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జగదంబ జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభం అవుతుందన్నారు.
చందనోత్సవం రోజున అప్పన్నస్వామి నిజరూపం ఎదుట పరోక్ష సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. రూ.1116 చెల్లించి టికెట్లు పొందిన భక్తుల గోత్రనామాలతో స్వామి సన్నిధిలో అష్టోత్తర శతనామార్చన చేస్తామన్నారు. టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు పోస్టు ద్వారా స్వామివారి నిర్మాల్య చందన పొట్లం ప్రసాదంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో టికెట్లు భక్తులు పొందవచ్చు.
విజయవాడలో మోదీ టూర్ సందర్భంగా.. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మళ్లించారు. బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని NH16 వైపు వెళ్లాలి. GNT నుంచి HYD వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణించాలి.
విజయవాడలో మోదీ టూర్ సందర్భంగా.. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మళ్లించారు. బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని NH16 వైపు వెళ్లాలి. GNT నుంచి HYD వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణించాలి.
ఆస్తి పంచలేదని తండ్రిపై కుమారుడు దాడిచేసి గాయపరిచిన సంఘటన చీరాల మండలం ఈపూరుపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సీతారామపేటకు చెందిన శ్రీనివాసరావు కుమారుడు నాగచంద్ర కొంతకాలంగా తనకు రావాల్సిన ఆస్తి పంచమని కోరుతున్నారు. ఈనేపథ్యంలో తండ్రి శ్రీనివాసరావుపై కుమారుడు నాగచంద్ర సోమవారం దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* వైజాగ్ – హైదరాబాద్ మధ్య <<13204421>>రాకపోకలు<<>> సాగించే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం రూట్లో వెళ్లాలి.
* వైజాగ్- చెన్నై మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గంలో వెళ్లాలి.
రోడ్డు దాటుతుండగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన మంగళవారం విజయవాడలో జరిగింది. శ్రీకాకుళం నగరానికి చెందిన ఎ.సావిత్రమ్మ (62) కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లారు. అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చారు. కెనాల్ రోడ్డులో వెళ్తుండగా వ్యాన్ ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు దొరబాబు ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జూనియర్స్ మెన్ సెలక్షన్ కమిటీ సౌత్ జోన్ సభ్యుడిగా నెల్లూరుకు చెందిన న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు ఉత్తర్వులు ఇచ్చారు. మలిరెడ్డి కోటారెడ్డి గతంలో రంజీ క్రీడాకారుడు. ఆయన నియామకంపై నెల్లూరు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు సెగ్మెంట్ 2 జిల్లాల్లో విస్తరించింది. అనంతపురం(పాక్షికం), ఆత్మకూరు, రాప్తాడు అనంత జిల్లాలో, కనగానపల్లి, C.కొత్తపల్లి, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా రాప్తాడు అసెంబ్లీ స్థానం 2009లో ఏర్పడింది. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పరిటాల సునీత గెలుపొందగా.. 2019లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.