Andhra Pradesh

News May 8, 2024

సింగపూర్‌కి చేరిన భారత నేవీ నౌకలు

image

భారత నౌకాదళానికి చెందిన ఢిల్లీ శక్తి కిల్తాన్ నౌకలు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఫ్లీట్ నేతృత్వంలో సింగపూర్‌కి చేరుకున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ సిబ్బంది అక్కడే భారత హై కమిషనర్ స్వాగతం పలికారు. ఈ పర్యటన దక్షిణ చైనా సముద్రంలో భారత నావికాదళం, తూర్పు నావికాదళం కార్యాచరణ విస్తరణలో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య స్నేహ సహకారం మరింత పెరుగుతుందన్నారు.

News May 8, 2024

సంతమాగులూరు: పిడుగుపాటుకు కాపరి మృతి

image

ఎండలకు ఉపశమనంలా వచ్చిన వాన కొందరికి సంతోషం, మరికొందరిలో విషాదం నింపింది. పల్నాడు జిల్లా, కుందుర్రివారిపాలెంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న సంతమాగులూరుకు చెందిన జమ్ముల గోపి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బతుకుతెరువు కోసం గొర్రెలు మేపుకుంటూ వెళ్లి గోపి మృతి చెందాడు. దీంతో సంతమాగులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 8, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడే ఈ సెట్

image

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల , ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం , సాయంత్రం వేళల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

News May 8, 2024

విశాఖ: మూడు రోజుల్లో 95.9% పోలింగ్

image

విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ రికార్డు సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన 13,076 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 12,541 మంది హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 95.9 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి 5,389 మంది దరఖాస్తు చేయగా 4,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో వీరి శాతం 77.78గా నమోదయింది.

News May 8, 2024

SKLM: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు సీట్ల కేటాయింపు

image

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు పరీక్ష రాసిన విద్యార్థులు సాధించిన మార్కుల బట్టి సీట్లను కేటాయించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లాలో 800 సీట్లకు గాను 720 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. వారి ఫోన్‌లకు సందేశాలను పంపించామని స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీలోగా విద్యార్థులు ఆయా గురుకులాల్లో వివరాలు తెలపాలన్నారు.

News May 8, 2024

ప్రత్తిపాడు అభ్యర్థి గెలుపుకోసం నటుడు ప్రచారం

image

ప్రత్తిపాడు నియోజకవర్గ  కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్య ప్రభని గెలిపించాలని కోరుతూ ప్రత్తిపాడులో ప్రముఖ సీరియల్ నటుడు ఇంద్రనీల్ వర్మ మంగళవారం ఇంటింటా ప్రచారం  నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సత్య ప్రభను, ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.

News May 8, 2024

విశాఖ: ఇంటర్ ఫెయిల్ అయిన వారికి తత్కాల్ అవకాశం

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇంటర్ బోర్డు తత్కాల్ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఫీజు చెల్లించలేని వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని పరీక్షల విభాగం కంట్రోలర్ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు రూ.3 వేలు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.

News May 8, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

image

ఎన్నికల నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళికలు పూర్తి చేసి, మే 13న ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సర్వ సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఆయా నోడల్‌ అధికారుల టీంలు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ పని చేయాలని స్పష్టం చేశారు.

News May 8, 2024

రెండో రోజు కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

మంత్రాలయం 145 నియోజకవర్గంలో కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టర్ బ్యాలెట్ ఓటింగ్ రెండో రోజు కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 222 నమోదు కాగా, హోమ్ ఓటింగ్ 12 నమోదు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో మంత్రాలయం తహశీల్దార్ పాల్గొన్నారు.

News May 8, 2024

ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

image

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రత్యేక పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా, అమిత్ కుమార్ సింగ్, అజయ నాథ్, పోలీసు పరిశీలకులు రవికుమార్ హాజరయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.