India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నకిలీ షేర్ మార్కెట్ యాప్ల ద్వారా రూ.67 లక్షలు నష్ట పోయారని బొబ్బిలి పట్టణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్, లోన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిక మొత్తాలకు ఆశపడితే మోసపోవడం తప్ప.. చేయగలిగిందేమి లేదన్నారు.

తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి రోజా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బుధవారం గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ‘కడుపు నిండా బోజనం చేసిన నిండు తల్లులు కడుపునిండి దీవించి వెళ్తుంటే అందులోని సంతోషం ఇంకెక్కడ దొరుకుతుంది. అమ్మల కోసం అమ్మ ప్రేమగా’ అని ఆ ఫోటోలను రోజా ట్వీట్ చేశారు. కాగా ఆమె రెండోసారి గెలిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

మహానంది పుణ్యక్షేత్రంలోని గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున చిరుత పులి సంచరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. డీఆర్ఓ హైమావతి, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. మరోవైపు మహానంది గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచించారు.

అనంతపురం నగరంలో నూతనంగా నిర్మించిన జిల్లా వైసీపీ కార్యాలయాన్ని అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి మున్సిపల్, అహుడా అనుమతులు తీసుకోకుండా కార్యాలయాన్ని నిర్మించారని తెలిపారు. త్వరలోనే వైసీపీ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన తెలిపారు. ఆ భవనం ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తామని తెలిపారు.

పిఠాపురం మాజీ MLA, టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మకు MLC పదవిపై హామీ దక్కినట్లు సమాచారం. కూటమి పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రాగా.. వర్మ ఆ సీటును త్యాగం చేశారు. అటు పవన్తోనూ ప్రచారంలో పాల్గొని గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పటికే MLC విషయంలో TDP అధినేత, CM చంద్రబాబు వర్మకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వర్మ సైతం ‘X’లో పోస్ట్ చేశారు.

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని తెలుగు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం..'(వర్కింగ్ టైటిల్) సినిమా స్క్రిప్ట్కి సంబంధించిన పూజలు చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు.

కడప జిల్లా ముద్దనూరులోని ఎస్సీ బాలుర హాస్టల్లో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న తరువాత విద్యార్థులకు వాంతులు అయ్యాయి. వెంటనే సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి కడప జిల్లా కలెక్టర్ మాట్లాడి సమాచారం తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలోని కావలి, నెల్లూరు డివిజన్లలోని 104 వాహనాలకు సంబంధించి బఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. డిగ్రీ అర్హతతో పాటు టైపింగ్ లో అనుభవం కలిగిన వారు నెల్లూరులోని 104 కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 47 మంది వార్డు వాలంటీర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులును కలిశారు. వైసీపీ నాయకులు తమను బలవంతంగా ఎన్నికల ముందు రాజీనామా చేయించారన్నారు. వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మున్సిపల్ కమిషనర్ వాలంటీర్లకు హామీ ఇచ్చారు.

ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం,పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనమయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.
Sorry, no posts matched your criteria.