India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పులివెందుల నియోజకవర్గం అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు వైఎస్సార్. 1970 దశకం నుంచి ఆ కుటుంబం నియోజకవర్గంపై బలమైన పట్టును కలిగి ఉంది. అలాంటి నియెజకవర్గంలో ఓ స్వతంత్ర అభ్యర్థి విజయబావుటా ఎగరేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చవ్వా బాలిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డిపై 5,008 ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన తప్ప మరే స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ విజయం సాధించలేదు.
క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామ పరిధిలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై తల్లీ కూతుళ్లు మృతి చెందారు. చనిపోయినవారు బొందల నాగేంద్రం (52) నాగరాణి (25)గా గుర్తించారు. వీరిద్దరూ పొలానికి వెళ్లి వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన ప్రారంభమై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీష ఎన్డీఏ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతు ప్రకటించారు. తనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఓటర్ల గందరగోళానికి గురికాకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో NOTAకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని ఓటర్లు ఎక్కువమందే వినియోగించుకున్నారు. 1,006 మంది నోటాకు జై కొట్టారు. నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓటింగ్ శాతం పరంగా నోటా 6వ స్థానంలో నిలిచింది. – మీరెపుడైనా నోటాకు ఓటేశారా..?
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంకవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు దేవరాజుగట్టు నరసింహులు(32) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
NOTA గురించి అందరికీ తెలిసిందే. అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయదలచుకోనప్పుడు NOTAకు వేయొచ్చు. గత ఎన్నికల్లో రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని ప్రజలు జనసేన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వేశారు. జమ్మలమడుగులో జనసేన-1038, నోటా- 2260 ఓట్లు పోలవ్వగా, రాయచోటిలో జనసేనకు 1480 మంది ఓటు వేస్తే, నోటాకు ఏకంగా 2226 మంది ఓటు వేశారు. ఈ రెండు స్థానాల్లో ఈసారి జనసేన పోటీలో లేదు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో విషాదం జరిగింది. మంగళవారం పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తి పరస రామారావుగా గుర్తించారు. పశువులు మేపుతుండగా పిడుగు పడినట్లుగా సమాచారం. మృతుడు RCM పాస్టర్ గా పనిచేస్తున్నాడు. రామారావు మృతితో యడవల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానపార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వారి తరఫున ప్రచారం చేసేందుకు సినీనటులు రావడంతో గోదారి జిల్లా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండటంతో ఆయన తరఫున మెగాహీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నారా రోహిత్ ఇప్పటికే ప్రచారం చేయగా.. జబర్దస్త్ ఫేమ్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
– మరి వీరి ప్రభావం ఏమైనా ఉంటుందా..?
పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 26 మందికి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండో విడత శిక్షణ తరగతులలో మొత్తం 4524 మందికి PO, APO శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆర్డర్లు పంపారు. అందులో 4498 మంది హాజరయ్యారని, 26 మంది ఏ విధమైన కారణం చూపకుండా శిక్షణకు గైర్హాజరు అయ్యారన్నారు. వారికి షోకాజ్ నోటీసులు పంపించినట్లు చెప్పారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఏయూ ఈఈటీ – 2024 ఫలితాలు మంగళవారం వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. పెందుర్తికి చెందిన సాయి ఈశ్వర్ మొదటి ర్యాంకును, చంద్రంపాలెంకు చెందిన కే సాయి ప్రణీత్ రెండవ ర్యాంకును, తగరపువలసకు చెందిన జీ మోహన్ సాయి సంపత్ మూడవ ర్యాంకును సాధించారు.
Sorry, no posts matched your criteria.