India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

➤ టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ: అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మందికి పోలియో చుక్కలు
➤ మత్తు పదార్దాలు అరికట్టాలి: డీఐజీ
➤ నరసన్నపేట: అక్రమ కట్టడాలపై వాడీ వేడి చర్చ
➤ బ్రాహ్మణతర్లలో ఆఖరి మజిలీకి అష్టకష్టాలు
➤ శ్రీకాకుళం రిమ్స్లో అన్యమత ప్రచారంపై నిరసన
➤ భార్య హత్య కేసు.. భర్తకు జీవిత ఖైదు.

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభి రామ్కు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు సమాచారం. పట్టాభి 8వ వార్డులో మాజీ కార్పొరేటర్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

TDP పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APIIC ఛైర్మన్గా ఉన్నారు. గతంలోనూ TDP జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండో సారి కూడా రామరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి, ప్రస్తుత ‘రుడా’ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని ఆయనకు అధిష్ఠానం కేటాయించింది. రాజానగరం స్థానం జనసేనకు కేటాయించడంతో, రమణ చౌదరి ఈ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. వెంకట రమణ చౌదరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.

TDP కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. తోట్లవల్లూరుకు చెందిన గురుమూర్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన TDPలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు.

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్లైన్లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.

గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు పేరు అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCAP) చైర్మన్గా పనిచేస్తున్నారు.

నెల్లూరులో పదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. సిటీలో గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఎక్కడన్నా గంజాయి వ్యాపారాలు సాగుతుంటే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నగదు సైతం ఇస్తామని ప్రకటించారు. యువత గంజాయి వాడకానికి దూరంగా ఉంటే క్రైం తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు. మీ COMMENT.

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య తక్షణమే ప్రత్యేక రైళ్లు నడపాలని బీజేపీ రాష్ట్ర విధాన పరిశోధన విభాగ సభ్యుడు డాక్టర్ కె.వి.వి.వి.సత్యనారాయణ వాల్తేరు డీఆర్ఎంను కోరారు. ప్రస్తుతం రైళ్లన్నీ ‘రిగ్రెట్’ (Regret) స్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం భోగికి వారం ముందు, కనుమ తర్వాత అదనపు రైళ్లు, కోచ్లు ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు (55) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం బోటులో వేటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి తీరానికి 70 మైళ్ల దూరంలో ఆయన ప్రమాదవశాత్తు బోటుపై నుంచి సముద్రంలో జారిపడ్డాడు. సహచర సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదని, మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు పోర్ట్ సీఐ రమేశ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.