India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్కు మెసేజ్లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.
సార్వత్రిక ఎన్నికలు-2024 కి సంబంధించి జిల్లాలో కొత్త ఓటర్ల జాబితా ఖరారైంది. జిల్లా మొత్తం 18,75,934 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషుల ఓటర్లు 9,29,859 మంది ఉన్నారు.. కాగా 9,45,945 మంది మహిళా ఓటర్ల ఉండగా ఇతరులు 130 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త జాబితాలో పురుషుల కంటే 16,086 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త ఓటర్ల ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వెచి చూడాల్సిందే..!
జిల్లాలో కనిగిరి మినహా మిగిలిన అన్ని కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన పొగాకు వేలంలో కిలో రూ.299 చొప్పున గరిష్ఠ ధర లభించింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4,394 బేళ్లు రాగా.. వాటిలో 3,822, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4,604 రాగా, 3,925 బేళ్లను కొనుగులు చేశారు. వేలం గత పదిహేను రోజుల వ్యవధిలో ఊపందుకోవడం గమనార్హం.
ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు డబ్బు, మరికొందరు విలువైన వస్తువులు అందజేస్తుంటారు. ఇటీవల చాలా మంది ఈ తాయిళాలను తిరస్కరిస్తున్నారు. ఈక్రమంలోనే నెల్లూరులోని పొగతోట, గాంధీనగర్, సంతపేట, స్టోన్ హౌస్ పేట, వేదాయపాలెం, కలెక్టరేట్ పరిసరాల్లో ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మకానికి లేవు, ఓట్లు కొనేవాళ్లు మా ఇంటికి రావద్దు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.
కొత్తగాజువాక నుంచి హిమాచల్నగర్ వెళ్లే రోడ్డులో ఓ వృద్ధుడు నిన్న చనిపోయాడు. స్థానికులు గాజువాక పోలీస్స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో హెచ్సీ బి.నారాయణ అక్కడకు వెళ్లి ఆరా తీశారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్, తోపుడు రిక్షాల కోసం ప్రయత్నించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో సాయంత్రం వరకు ఎదురుచూసి సామాజిక కార్యకర్త తరుణ్ సాయంతో బైక్పై శ్మశానవాటికకు తరలించి ఖననం చేశారు.
పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ప్రచారంతో పాటు పోల్మేనేజ్మెంట్ తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రహస్య స్థావరాలకు ఓటర్లను పిలిచి డబ్బు ఇస్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. పొన్నూరులో సచివాలయ ఉద్యోగి తిరుమేళ్ల కిషోర్ బాబు అనుమానాస్పదంగా మృతిచెందాడు. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం 6గంటలకు వాటర్ లెవెల్స్ తీయడానికి మున్సిపల్ వాటర్ వర్క్స్లోని 100 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు వచ్చి ట్యాంక్లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనివార్య కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోని ఉద్యోగులు నేడు, రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అంతర్ జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నం పాండురంగ హైస్కూల్ లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.
కమలాపురం స్టేట్ బ్యాంక్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ మృతి చెందినట్లు ఎస్సై రిషికేశవరెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాజ్ గంజి జిల్లాకు చెందిన సూరజ్ కుమార్ ఎస్బీఐ బ్యాంక్ నందు కార్పెంటర్ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి తన సహచరులతో కలిసి బ్యాంకు పైన నిద్రపోతున్నారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడని తెలిపారు.
ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024-25 సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఎంటెక్(MTech) ఇంటర్నేషనల్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 21.
Sorry, no posts matched your criteria.