Andhra Pradesh

News May 7, 2024

షర్మిలపై కేసు నమోదు చేసిన బద్వేలు పోలీసులు

image

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యకేసు ప్రస్తావించారనే ఆరోపణలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎన్నిలు పూర్తయ్యే వరకు వివేకా హత్యపై ప్రచారాల్లో మాట్లాడకూడదని కడప కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2024

ఈనెల 9న కళ్యాణదుర్గానికి సీఎం జగన్ రాక

image

ఈనెల 9న సీఎం జగన్ కళ్యాణదుర్గానికి రానున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య తెలిపారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. కావున నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News May 7, 2024

నెల్లూరులో మేనిఫెస్టోల రాజకీయం 

image

నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడూలేని విధంగా కొత్త ఒరవడి మొదలైంది. పార్టీల మేనిఫెస్టోలు కాకుండా అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపకల్పన చేశారు. వైసీపీ నెల్లూరు అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేశారు. నిన్న కోవూరు కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమారెడ్డి, ఎంపీ అభ్యర్థి రాజు మేనిఫెస్టోను ప్రకటించారు. సర్వేపల్లిలోనూ సోమిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు.

News May 7, 2024

విశాఖ ఎంపీగా ఎన్నికైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్

image

విజయనగరం సంస్థానాధీశుడు పీవీజీ రాజుకు స్వయంగా చిన్నాన్న అయిన పూసపాటి విజయానంద గజపతిరాజు(సర్ విజ్జీ) 1962లో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1926లో సొంతంగా క్రికెట్ జట్టును ఏర్పాటు చేసుకుని 1938లో ఇంగ్లాండ్ వెళ్లి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. దీంతో ఆయన 1952లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. క్రికెట్‌కు విస్తృత ప్రచారాన్ని కల్పించిన ఆయన 1965లో కన్నుమూశారు.

News May 7, 2024

విజయనగరం: ఒకే మండలం.. రెండు నియోజకవర్గాలు

image

జామి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. మండల వ్యాప్తంగా 27 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిలో 13 పంచాయతీలు శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోనూ, మిగిలిన మరో 14 పంచాయతీలు గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఈ మండలానికి శృంగవరపుకోట, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ వస్తున్నారు.

News May 7, 2024

విజయనగరంలో నేడు నారాలోకేష్ యువగళం సభ

image

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు జిల్లాకు వస్తున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత, నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నారు. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లలో లోకేష్ ముఖా ముఖీ మాట్లాడతారు. తొలుత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసంగిస్తారు

News May 7, 2024

ఓటు పండగకు శుభలేఖ పంపిన జిల్లా కలెక్టర్

image

వివాహాది శుభ కార్యాలకు ఆహ్వాన పత్రికలను అట్టహాసంగా ముద్రించడం పరిపాటి. ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్పులు మాత్రమే పంచి పెడతారు. కానీ కర్నూలు కలెక్టర్ జి.సృజన వినూత్నంగా ఆలోచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు మించిన శుభకార్యం వేరే ఏముంది అనుకున్నారు. ‘ఎన్నికల పర్వం దేశానికే గర్వం’ అంటూ ఈ శుభ కార్యానికి జిల్లా పెద్దగా ప్రజలందరికీ ఆహ్వానం పంపారు. మే13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేయాలని కోరారు.

News May 7, 2024

ముగ్గురు CMలు మొదలు పెట్టిన పూర్తి కాని కడప ఉక్కు పరిశ్రమ

image

కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. కానీ అది శంకుస్థాపనలకే పరిమితమై, ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వరకు ముగ్గురు సీఎంలు శంకుస్థాపనలు చేశారు. 2007 జూన్ 10న YSR మొదటగా పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. మళ్లీ పదేళ్లకు 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక మూడోసారి జగన్ 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News May 7, 2024

రాజోలు వైసీపీ అభ్యర్థి గొల్లపల్లికి అస్వస్థత

image

రాజోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో సోమవారం ఆయన అస్వస్థతకు గురి కాగా.. మలికిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఎండల ప్రభావంతో రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న గొల్లపల్లి సూర్యారావును ఆసుపత్రిలో చేర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎటువంటి అధైర్యానికి గురికావద్దని సూర్యారావు కోరారు.

News May 7, 2024

REWIND: ఎమ్మెల్యేలుగా తండ్రి, తల్లి, కొడుకు

image

ప.గో జిల్లాలో తండ్రి, తల్లి, కొడుకు వేర్వేరు పార్టీల నుంచి MLAలు అయ్యారు. తాడేపల్లిగూడెం నుంచి ఈలి ఆంజనేయులు 1972లో స్వతంత్ర అభ్యర్థిగా, 1983లో TDP నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతితో ఉప ఎన్నిక రాగా.. 1983లో ఆంజనేయులు సతీమణి ఈలి వరలక్ష్మి TDP నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో ఆమె కాంగ్రెస్ నుంచి మరోసారి MLA అయ్యారు. వీరి కుమారుడు ఈలి మధుసూదనరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి MLA అయ్యారు.