Andhra Pradesh

News June 25, 2024

తూ.గో: 10Th క్లాస్‌తో జాబ్స్.. రూ.12వేల జీతం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా పశు సంచార వాహనాల్లో ఖాళీగా ఉన్న 5 పైలట్ పోస్టుల భర్తీకి ఈనెల 28న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రాజమండ్రి పశు వైద్యశాలలో శుక్రవారం 10AM నుంచి 2PM వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
☞ SSC పాసై ఉండాలి
☞ 2 (OR) 3ఏళ్ల అనుభవంతో హెవీ లైసెన్స్ ఉండాలి
☞ వయసు: 35 ఏళ్లలోపు
☞ డ్యూటీ టైమింగ్స్: 8AM-5PM
☞ వేతనం నెలకు రూ.12వేలు

News June 25, 2024

కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తా: CM

image

కుప్పం సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘కుప్పానికి రూ.100 కోట్లు కావాలని ప్రజలు కోరుతున్నారు. వంద కాదు.. ఎంతైనా ఇస్తా. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తా. రూ.10 కోట్ల చొప్పున కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలకు రూ.40 కోట్లు ఇస్తా. మేజర్ పంచాయతీలకు రూ.2 కోట్లు, మైనర్ పంచాయతీకి రూ.కోటి కేటాయిస్తాం. కుప్పం మున్సిపాల్టీని రోల్ మోడల్‌గా మారుస్తా’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

News June 25, 2024

అమెరికాలో గోపికృష్ణను కాల్చి చంపిన నిందితుడు అరెస్టు

image

అమెరికాలోని డల్లాస్‌లో బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ (32)ని ఓ దుండగుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దుండగుడు మాథిసిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతనిపై అభియోగాలు నమోదు చేశామని, గతంలో కూడా హత్యానేరం ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గోపికృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు.

News June 25, 2024

NLR: క్వార్ట్జ్ అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ అక్రమాల్లో సజ్జల రామకృష్ణ, ఆయన అనుచరుల పాత్ర తేల్చాలని సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ DSPకి ఫిర్యాదు చేశారు. ‘సజ్జల కనుసన్నల్లోనే గనుల దోపిడీ జరిగింది. జోగుపల్లిలోని 240 ఎకరాల్లో మాకు 8గనులు ఉన్నాయి. రెండేళ్లుగా అక్రమంగా గనులు తవ్వి రూ.వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ దోచేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు’ అని ఆయన ఆరోపించారు.

News June 25, 2024

శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు అవగాహన

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మంత్రి దుర్గేష్, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

News June 25, 2024

బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని.. భూమిని అమ్మేశాడు

image

లోన్ ఇప్పిస్తానని నమ్మించి భూమిని అమ్మేశారని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి(M) ఊటుకూరు చెందిన హనుమంతప్పకు 5.10 ఎకరాల భూమి ఉంది. హిందూపురానికి చెందిన జనార్దన్‌రెడ్డి భూమికి బ్యాంక్‌ లోన్ ఇప్పిస్తానని నిరాక్షరాస్యులైన హనుమంతప్ప, కుటుంబాన్ని నమ్మించి నెల్లూరు(D)కు చెందిన కుసుమకుమారికి రిజిస్ట్రేషన్ చేయించారు. అకౌంట్‌లు ఓపెన్ చేయించి రూ.3లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News June 25, 2024

టెక్కలి: రైతు భరోసా పథకం ‘అన్నదాత సుఖీభవ’ గా మార్పు

image

రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఇక ‘అన్నదాత సుఖీభవ’గా కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు సంబంధించిన పేరును మార్పు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరుతో పాటు ఏపీ ప్రభుత్వం లోగోను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News June 25, 2024

కృష్ణా: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కాకినాడ టౌన్(CCT)- లింగంపల్లి(LPI) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07445 CCT- LPI రైలును జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వారంలో 3 రోజులు, నం.07446 LPI- CCT రైలును జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు వారంలో 3 రోజులు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News June 25, 2024

చిత్తూరు జిల్లాలో కొత్తగా 2 మండలాలు

image

చిత్తూరు జిల్లాలో కొత్తగా 2 మండలాల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కుప్పం నియోజకవర్గంలో మల్లనూరు, రాళ్లబూదగూరును మండలాలు చేయాలని కోరారు. నిన్ననే వీటి మీద ఆదేశాలు ఇచ్చా. ఇక కుప్పంలో 6 మండలాలు, ఓ మున్సిపాల్టీ ఉంటుంది. కుప్పం డిపో బస్సులను కూడా దొంగలించారు. వాటిని వెనక్కి తీసుకొచ్చాం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను కుప్పం డిపోకు ఇస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.

News June 25, 2024

ప్రకాశం: పెరిగిన ధరతో లబ్ధి ఎంతంటే..

image

జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నాయి. అందులో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎకరాకు సగటున 1,900 కిలోల వరి దిగుబడి లభిస్తుంది. రూ.117 అదనపు ధర లభించడంతో వరి రైతులకు రూ.95కోట్లు అదనంగా సమకూరనుంది. మొక్కజొన్న మీద క్వింటాకు రూ.135 పెరగడంతో అదనంగా రూ.3,750 లాభం రానుంది. పత్తిపై అదనంగా క్వింటాకు రూ.501 పెంచడంతో అదనంగా రూ.6వేల వరకు లాభం చేకూరనుంది.