Andhra Pradesh

News May 7, 2024

సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనపై దర్యాప్తు

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడికి గాయాలైన విషయం తెలిసిందే. కాకినాడ DSP హనుమంతరావు, శిక్షణ DSP ప్రమోద్, SI బాలాజీ సోమవారం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తాటిపర్తికి చెందిన వెంకటరమణ, వీరబాబును అదుపులోకి తీసుకొని, బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తుంది.

News May 7, 2024

సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ రెండు ట్రిప్పులు మాత్రమే

image

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ మధ్య దువ్వాడ మీదుగా స్పెషల్ రైళ్లు జూన్ 24వ తేదీ వరకు 7ట్రిప్పులు నడుపుతున్నట్లు ఈనెల ఆరవ తేదీన వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డిసిఎం సందీప్ ప్రకటించారు. కానీ వీటిని కుదించి కేవలం రెండు ట్రిప్పులు మాత్రమే నడుపుతున్నట్లు సోమవారం మరో ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News May 7, 2024

చిలకలూరిపేట: భావోద్వేగానికి గురైన వెంకటకుమారి

image

చిలకలూరిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా తరలివచ్చిన మహిళల సమక్షంలో కొంగుపట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నా అంటూ పుల్లారావు సతీమణి వెంకటకుమారి కన్నీటి పర్యంతమయ్యారు. పాతికేళ్ల ప్రస్థానంలో ప్రతిక్షణం చిలకలూరిపేట ప్రజల కోసమే ఆయన ఆలోచించారన్నారు. మంచి మనిషిపై గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో అభాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

News May 7, 2024

పొందూరు:ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణిపై కత్తితో దాడి

image

పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామంలో సోమవారం సాయంత్రం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తుండగా ప్రతిపక్షానికి చెందిన కొందరు కార్యకర్తలు ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆమె కారు డ్రైవర్ అడ్డుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. కోన సత్యనారాయణ, బలగ రామశంకర్రావు, అన్నెపు రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 7, 2024

8న హనుమాన్ జంక్షన్‌‌లో పవన్ పర్యటన

image

బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ తెలిపారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా పవన్ రానున్నట్లు తెలిపారు. హనుమాన్ జంక్షన్‌లోని హెచ్ మార్ట్ వద్ద ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News May 7, 2024

సుగంధ ద్రవ్యాలతో అప్పన్న చందనం మిళితం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారికి సమర్పించే చందనాన్ని సుగంధ ద్రవ్యాలతో మిళితం చేశారు. ఈనెల 10వ తేదీన స్వామి చందనోత్సవంనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా 135 కిలోల చందనం అరగదీశారు. చందనోత్సవం రోజున స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నేపథ్యంలో స్వామికి సహస్త్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తారు.

News May 7, 2024

VZM: చంద్రబాబు కురుపాం పర్యటన ఖరారు

image

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 9న ఎన్నికల ప్రచారానికి కురుపాం రానున్నారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు కురుపాం మండల కేంద్రం సమీపంలోని జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన కోర్ కమిటీ సోమవారం సాయంత్రం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వీరేశ్ దేవ్ ఇంటి వద్ద సమావేశమయ్యారు.

News May 7, 2024

నేడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతి

image

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతిని మంగళవారం అన్ని చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్మారక ప్రాంతాలైన కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటతో పాటు అల్లూరి దాడులు జరిపిన రాజవొమ్మంగి, చింతపల్లి, అడ్డతీగల పోలీసు స్టేషన్ల వద్ద వర్థంతి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాతీయ అల్లూరి యువజన సంఘం సభ్యులు తెలిపారు. 

News May 7, 2024

శ్రీకాకుళం: RTC డ్రైవింగ్ స్కూల్‌లో దరఖాస్తులకు ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లాలో APSRTC హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పొందుటకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని జిల్లా ప్రజారవాణా అధికారి విజయ కుమార్ సోమవారం తెలిపారు. శిక్షణ కోసం లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ LMV (ఫోర్ వీలర్) లైసెన్స్ ఉండాలని అన్నారు. ఇప్పటివరకు 15 బ్యాచ్‌లలో సుమారు 250 మంది డ్రైవర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.

News May 7, 2024

ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్ హరి నారాయణన్

image

నెల్లూరులో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ 8వ తేదీలోగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలన్నారు.