Andhra Pradesh

News June 25, 2024

అమ్మవారి మాలధారణలో పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో దర్శమమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ MLAలకు ఆయన శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని సమస్యలపై ఆయన దూకుడు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ అవగాహన కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు.

News June 25, 2024

జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

image

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.

News June 25, 2024

జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

image

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.

News June 25, 2024

నెల్లూరు: గ్యాస్ కనెక్షన్‌కు ఈకేవైసీ తప్పనిసరి

image

నెల్లూరు జిల్లాలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. గ్యాస్ కనెక్షన్ పొందిన ప్రతి లబ్ధిదారుడు ఈనెలాఖరులోగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. లేనియెడల ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ సకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా ఉండాలన్నారు. కనెక్షన్ కుటుంబంలో మగ, ఆడ ఎవరి పేరు మీద ఉన్న సబ్సిడీ వర్తిస్తుందన్నారు.

News June 25, 2024

నాటి నుంచి నేటి వరకు మిథున్‌రెడ్డి ప్రయాణం

image

వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సోమవారం ముచ్చటగా మూడోసారి గెలిచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 2014 ఎన్నికల్లో 1,74,062 ఓట్ల మెజార్టీతో నాటి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరిపై గెలిచారు. 2019లో 2,68,284 ఓట్ల మెజార్టీతో TDP అభ్యర్థి సత్యప్రభపై విజయం సాధించారు. ఇక 2024లో ఉమ్మడి AP మాజీ CM కిరణ్‌కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.

News June 25, 2024

కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు: జేసీ

image

ఏలూరు జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జేసీ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టమాటా, ఉల్లి, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పుష్పమణి , జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ ఏడీ రామ్మోహన్ పాల్గొన్నారు.

News June 25, 2024

కర్నూలు జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1801 ఎస్టీటీలతో కలిపి మొత్తం 2678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 ఎస్టీటీలతో కలిపి మొత్తం 811 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

ఈనెల 27న మార్కాపురంలో జాబ్ మేళా

image

మార్కాపురంలో ఈనెల 27న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపల్ నరేంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఏడు కంపెనీలకు చెందిన వారు పాల్గొని, విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనాలని సూచించారు.

News June 25, 2024

విజయవాడ: నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

విజయవాడలో ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవల్ లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాధరపురం కార్మిక శాఖ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణమని అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని వారు వెల్లడించారు.