India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్ కుమార్ను నియమిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 8 గంటల లోపు అనంతపురంలో విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషనర్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
పెద్దమండ్యం మండలం కలిచర్లలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. సోమవారం ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
హెల్ప్ లైన్ నంబర్లు :
గన్నవరం – 9885970848
గుడివాడ – 9676993147
పెడన – 9553125124
మచిలీపట్నం – 9010021352
అవనిగడ్డ – 7981826714
పామర్రు – 9989347699
పెనమలూరు – 9966485895
ఉదయగిరి మండలం కుర్రపల్లి పరిసర ప్రాంతాలలో ఉరుముల మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మూడు నెలల నుంచి కాస్తున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. అధిక ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈవర్షంతో కొంత ఉపశమనం కలిగింది.
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటువేసింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికలు విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించింది.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఆదివారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు జనసేన నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. దానిలో.. ‘వైసీపీ మార్క్ రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించం. YCP అల్లరిమూకల దాడిలో జనసైనికుడు శ్రీధర్ తలకు గాయంకావడం బాధాకరం. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఉండటం ఎంతవరకు సమంజసం?’ అని ఉంది.
ఏలూరులోని నిమ్మకాయల యార్డ్ రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. మృతుడి ఎడమ చేతిపై హిందీలో ‘మా’ అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు ఢీకొట్టిందా..? లేదా జారిపడ్డాడా..? తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రముఖ సినీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనను గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని, టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆటపాక నుంచి ఏలూరు రోడ్డు వరకు రోడ్ షో ద్వారా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. ఈ మేరకు సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ నెల 9వ తేదీన నరసన్నపేటలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దు అయిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలని వారు స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 7న దర్శికి రానున్నట్లు టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. దర్శి పట్టణానికి సమీపంలోని శివరాజ్ నగర్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. అక్కడే బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారుల అనుమతి సైతం కోరినట్లు సమాచారం. సాయంత్రానికి పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామని నాయకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.