India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఉత్తమ నెల్లూరుకు చెందిన దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, కర్లపూడికి చెందిన దువ్వూరు మోహన్ రెడ్డి, గూడూరుకు చెందిన చింతంరెడ్డి కృష్ణారెడ్డి విజయవాడలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పల్నాడు రోడ్డులో ఉన్న SSN కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం బయట టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ కారు ధ్వంసమైంది. దీంతో కేంద్ర బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టగా.. పలువురు రాళ్లు రువ్వారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని పెద్దాకుల వీధికి చెందిన శ్రీదేవి సుష్మల్(43) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న శ్రీదేవి ఇంట్లో చిన్నచిన్న తగాదాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
తిరుపతి నగరంలోని 32వ డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి తరఫున ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో సీఎం జగన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు అన్నదమ్ముల్లా సమిష్ఠిగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
అనకాపల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూటమి MPఅభ్యర్థి CM రమేశ్, YCP అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు..పరస్పర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘ఏ మండలంలో అయితే బూడి ముత్యాలనాయుడు రౌడీలు నన్ను అడ్డుకొని దాడి చేశారో అదే మాడుగుల నియోజకవర్గం,దేవరాపల్లి(M)లో 24 గంటలు గడవకముందే YCPని విడిచి కూటమికి మద్దతు తెలిపిన వేలాది మంది నాయకులు,కార్యకర్తలు’అంటూ CM రమేశ్ ట్వీట్ చేశారు.
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సాలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర అన్నారు. సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్రెడ్టిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి థింసా నాట్యం చేశారు.
D.El.Ed 4వ సెమిస్టర్ పరీక్షలకు ప్రైవేటు విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 4 సబ్జెక్టులకు రూ.250, 3 సబ్జెక్టులకు రూ.175, రెండింటికి రూ.150 ఒక సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభలో విజయానంద రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు. మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు మాటమీద నిలబడే వ్యక్తి కాదని, 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన హామీలను కాపీ కొట్టి ఆంధ్ర రాష్ట్రంలో చేస్తానని చెప్తున్నాడన్నారు.
అనంతపురంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నిర్వహించే ఆర్డీటీ సెట్ ప్రవేశ పరీక్షకు 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన్మురళీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ పరీక్షకు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసుల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన బొమ్మసాని నాగేశ్వరావు(55) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రఘునాథరావు సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసగా మారి ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భార్య మందలించింది. క్షణికావేశంతో అతడు పురుగు మందు తాగగా, కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.