India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. వర్షకాలం ప్రారంభమైనందున తాగునీరు కలుషితం కాకుండా చూడటం, దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు..పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం పాటించాలన్నారు.

రాజమండ్రి స్టేషన్ మీదుగా రద్దు చేసిన 26 ట్రైన్లలో 3 రైళ్లను రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి విశాఖ-లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ యధావిధిగా నడవనుంది. అలాగే కాకినాడ పోర్ట్-పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు-విజయవాడ మధ్య మెమూ ఎక్స్ప్రెస్లను కూడా యధావిధిగా నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
➠ SHARE IT..

శ్రీ సత్యసాయి జిల్లాను డయేరియా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. మురికి నీటి గుంతలపై మున్సిపల్, పంచాయితీ అధికారులు దృష్టి సారించాలన్నారు. డయేరియా కేసులు ఉన్నట్టు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు నిర్భయంగా తమ సమస్యలును తెలియజేయాలని వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు తీర్చడం కోసం పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండీ జిల్లా ఎస్పీ 79 ఫిర్యాదులు స్వీకరించారు.

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు.

మహానంది ఆలయంలో సోమవారం రాత్రి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు స్థానిక అలంకారం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, అలంకారపూజ చేపట్టారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాకారం చుట్టూ పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రూట్లో పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి స్టేషన్లకు సుమారు 200 మంది ఉద్యోగులు సీజన్ టికెట్లు తీసుకుని రోజువారీ విధులకు వెళ్లొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగానైనా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని ఉద్యోగులు కోరుతున్నారు.

సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షణను విజయవంతం చేయాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ఆలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమీక్షలో ఆయన మాట్లాడుతూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాలన్నారు.

విద్యా శాఖా మంత్రిగా నారా లోకేశ్ అమరావతిలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను నెల్లూరు జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు కలసి అభినందించారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మామిడికుదురు మండలం నగరం గ్రామంలో సరిహద్దులోని కొబ్బరి చెట్ల విషయమై ఘర్షణకు దిగిన 2 కుటుంబాలపై కేసులు నమోదు చేశామని ఎస్సై సురేష్ సోమవారం తెలిపారు. నగరం కొత్త రోడ్డుకు చెందిన వెలుగొట్ల సూర్యకుమారి ఫిర్యాదు మేరకు ఒక కేసు.. వెలుగొట్ల విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశామన్నారు. 2 కుటుంబాలు సరిహద్దులోని కొబ్బరి చెట్ల విషయంలో గొడవపడి గాయపడ్డారన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు SI తెలిపారు.
Sorry, no posts matched your criteria.