India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీసీల రక్షణ కోసం బీసీ చట్టం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఎర్రగొండపాలెంలోనీ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎరిక్షన్ బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పరిధిలో మే 6 నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ జరుగనుందని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా సంబంధిత ప్రక్రియలను నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జీ.సృజన అధికారులను ఆదేశించారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాణి రుద్రమదేవి ఏలిన పోరుగడ్డ మన నిడదవోలు. బ్రిటిష్ వారి వ్యాపారాలకు జల రావాణాలో ముఖ్య కేంద్రం ఇది. 2008 వరకు కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు.. ఆ తర్వాత విడిపోయింది. ఇప్పటివరకు ఇక్కడ 3సార్లు ఎన్నికలు జరగగా.. 2009, 14లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధించాయి. 4వ సారి జరుగుతున్న పోరులో కందుల దుర్గేశ్(జనసేన), శ్రీనివాస్ నాయుడు (వైసీపీ), పెద్దిరెడ్డి సుబ్బారావు(కాంగ్రెస్) తలపడుతున్నారు.
ఉదయగిరి TDPలో బేధాభిప్రాయాలు పోలింగ్ రోజుకీ సర్దుబాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ నేతలు సీనియర్స్ వర్సెస్ జూనియర్గా మారారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాకర్ల సురేశ్ సీనియర్లను పట్టించుకోవడం లేదంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఇంకా ప్రచారంలోకి రాలేదు. నిన్న నెల్లూరులో సోమిరెడ్డి, బీదలతో చర్చించాక ఆయన ఉదయగిరికి వచ్చారు. తాజా పరిస్థితులను కాకర్ల ఎలా ఫేస్ చేస్తారో?
ప్రచారంలో గర్భిణీపై దాడి జరిగిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. వేపూరికోట(P) కుటాగోళ్లపల్లెతో వైసీపీ ప్రచారం జరిగింది. మల్లికార్జున భార్య కళ్యాణి 8 నెలల గర్భిణీ. ప్రచారానికి వచ్చిన నాయకులను తాగునీటి విషయమై నిలదీశారు. దీంతో నాయకులు తనపై దాడి చేశారని కళ్యాణి ఆరోపించారు. ఎస్ఐ తిప్పేస్వామిని వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.
అరకు లోక్సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బిహార్లోని గోపాల్గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.
కాకినాడలో పోస్టల్ ఓటింగ్లో ఓ పార్టీ నేతలు సిబ్బందిని ప్రలోభపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పీఆర్ డిగ్రీ కాలేజ్లోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు సిబ్బంది.. ఆ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఓటు వేసినట్లు ఫొటోలు చూపించి రూ.3 వేల చొప్పున తీసుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అలెర్ట్ అయ్యి.. ఫోన్స్ తీసుకెళ్లకుండా చూసినట్లు తెలుస్తోంది.
అరకు లోక్సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బీహార్లోని గోపాల్గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.
ఖాజీపేట మండల పరిధిలోని సిద్ధాంతపురంలో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రైతు కందుల రామిరెడ్డి పొలం వెళ్లి విద్యుత్తు మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు.
Sorry, no posts matched your criteria.