Andhra Pradesh

News May 4, 2024

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రిఅప్పన్నకు సమర్పిస్తారు.

News May 4, 2024

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రి అప్పన్నకు సమర్పిస్తారు.

News May 4, 2024

విజయవాడ రైల్వే డివిజన్‌కు రూ.7.96కోట్ల ఆదాయం

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుంచి ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.7.96కోట్ల ఆదాయం డివజన్‌కు లభించింది. వివిధ రైళ్లు, స్టేషన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 44,249 మందిపై కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు, అక్రమ రవాణాపై 51,271 కేసులు నమోదు చేసి రూ.2.79కోట్లు, ఇతర కేసుల ద్వారా రూ.92 లక్షలు వసూలు చేసినట్లు రైల్వే అధికారి నరేంద్ర అనందరావు తెలిపారు.

News May 4, 2024

తిరుపతి: వివిధ పరీక్షల ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో MED మూడవ సెమిస్టర్, BPED మొదటి సెమిస్టర్, DPED మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News May 4, 2024

గుంటూరు జిల్లాలో ఎంత మంది ఓటేశారో చూసేయండి..!

image

గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన హోం ఓటింగ్ ప్రక్రియలో 2వేలకు పైగా దరఖాస్తులు రాగా.. 1,011 మంది ఓటేశారు. తాటికొండలో 449 మంది దరఖాస్తు చేసుకోగా 122మంది ఓటేశారు. మంగళగిరిలో 452కు 151, పొన్నూరులో 284కు 114 , తెనాలిలో 352కు 166, ప్రత్తిపాడులో 367 కు 200, గుంటూరు పశ్చిమలో 247 కు 187, గుంటూరు తూర్పులో 79 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది ఓటేశారని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

News May 4, 2024

ఈనెల 9న చీపురుపల్లికి చంద్రబాబు 

image

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 9న చీపురుపల్లిలో నిర్వహించే ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లి పట్టణంలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News May 4, 2024

అనంత: ఏపీ ఈసెట్-2024కు 37,767 దరఖాస్తులు

image

పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2024 పరీక్షకు 37,767 దరఖాస్తులు వచ్చాయని అనంతపురం జేఎన్టీయూకు చెందిన ఈసెట్ ఛైర్మన్ ఆచార్య శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మే 2న ముగిసిందన్నారు. ఈ నెల 8న ఈసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో 2 కేంద్రాలు, ఏపీలో 98 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News May 4, 2024

సికింద్రాబాద్-బరంపురం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

image

సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా బరంపురం ప్రాంతానికి ఈనెల 11,14 తేదీల్లో, తిరిగి 12,15 తేదీల్లో 07035 నంబరు గల వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.శాందీప్ వివరాలు వెల్లడించారు. ఈనెల 11,14 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బరంపురం చేరుకుంటుందని తెలిపారు.

News May 4, 2024

కడప: బాలికల పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప నగరం చిన్నచౌక్‌లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పి.విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అర్హులైన బాలికలు తమ దరఖాస్తులను చిన్నచౌక్ లోని గురుకుల పాఠశాలలో అందచేయాలని ఆమె తెలిపారు. వివరాలకు 9440687844, 8555074045 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.

News May 4, 2024

మచిలీపట్నం: జిల్లాలో 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు జారీ

image

ఈ నెల 13వ తేదీన జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో 48 గంటల ముందు 11వ తేదీ నుంచి సెక్షన్ 144 అమలు చేస్తూ కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఎక్కడా కూడా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.