India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లాలో మే 13 న జరగనున్న ఎన్నికలకు 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ మేరకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని,1309 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో శుక్రవారం ఈవీఎంల అదనపు కేటాయింపు ప్రక్రియపై పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు . అందులో భాగంగా వివరాలు వెల్లడించారు.
మంత్రాలయం నియోజకవర్గంలో బరిలో 8మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్రరెడ్డి పేరును పోలిన మరో ఇద్దరు, వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి పేరున పోలిన పేరుతో ఒకరు ఎన్నికల బరిలో ఉన్నారు. జాతీయ జనసేన పార్టీ నుంచి ఆర్. రాఘవేంద్రరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఎం. రాఘవేంద్రరెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కె.నాగిరెడ్డి పోటీలో ఉన్నారు.
సీఎం జగన్ ఇవాళ హిందూపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు హిందూపురం టీడీపీ కంచుకోటగా మారింది. ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్ పర్యటన హిందూపురంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకట రమణ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నేడు మరోసారి జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకోనున్నారు. అనంతరం 3.10 నిమిషాలకు ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. 3.30 గంటలకు ఆయన నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురికి సెల్ఫ్ బెయిల్ మంజూరైంది. ఈ కేసులో YCP నేతలు చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితులకు సెల్ఫ్ బెయిల్ మంజూరు చేశారు. కాగా ఇదే కేసులో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుని A1గా చూపారు.
వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తథ్యమని ప.గో. జిల్లా ఉండి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు, సినీనటుడు పృథ్వీరాజ్లతో కలిసి పాలకోడేరు, కొండేపూడి, వేండ్ర, గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు 136 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తారన్నారు. కూటమి మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు.
తాటిమాకుల కండ్రిగ గ్రామానికి చెందిన మహేశ్ బాబు(49) పొలం వద్ద బోరు మోటార్ మరమ్మతుకు గురైంది. మెకానిక్ సాయంతో బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా చేతిలోని ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగపై పడటంతో అతను విద్యుత్ షాక్కు గురై కిందపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కడప జిల్లాల్లో 1955లో శాసనసభకు ఎన్నికలు జరగడం మొదలయ్యాయి. అప్పట్లో మన జిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 2004 వరకు కొనసాగాయి. జిల్లాల పునర్విభజన కారణంగా 2004లో ఒక నియోజకవర్గంగా ఉన్న లక్కిరెడ్డిపల్లెను తప్పించారు. ఇందులో ఉన్న మండలాలను రాజంపేట, రాయచోటిలోకి కలపడంతో ఆ నియోజకవర్గం కనుమరుగైంది. ఈ లక్కిరెడ్డిపల్లె మొదటి ఎమ్మెల్యే కడప కోటిరెడ్డి. చివరి ఎమ్మెల్యే జి.మోహన్ రెడ్డి(కాంగ్రెస్).
ప్రకాశం జిల్లాలో మొదటి ఓటరుగా యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజన గూడేనికి చెందిన జండా వత్ నాగలక్ష్మీ బాయి స్థానం సంపాదించుకున్నారు. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంలో మొదటి బూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచే ఓటరు జాబితా కూడా ప్రారంభమవుతుంది. మైదాన ప్రాంతం నుంచి పాలుట్ల చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు పాలుట్ల వెళ్లేందుకు ప్రత్యేక కమాండర్ జీపులను వినియోగిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.