India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది వారి ఓటు హక్కును 5, 6వ తేదీలలో వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
ఏపీలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మకమైనవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో నంద్యాల (D) ఆళ్లగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు, కేంద్ర బలగాలతో కూడిన భారీ భద్రత నడుమ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.
జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈవీఎమ్ యూనిట్లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో శుక్రవారం నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత తెలిపారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎమ్ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్.తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పక ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎంసీఎంసీ కమిటీ ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదన్నారు.
ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ అమిత్ బర్దర్తో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. కంట్రోల్ సెంటర్లో నమోదయ్యే వివరాలను సేకరించారు. సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎదురయ్యే సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం పరిధిలో బరిలో 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో అదనంగా బ్యాలెట్ యూనిట్ వినియోగిస్తున్న క్రమంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, సాధారణ పరిశీలకుడు అమిత్ శర్మ, రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఆన్లైన్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈవీఎంల అధికారి టీ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ 2వ రోజు శుక్రవారం కొనసాగింది. తొలి రోజు 399 మంది వృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్లో పాల్గొనగా 2వ రోజు 606 మంది పాల్గొన్నారు. మొత్తం 1005 మంది హోమ్ ఓటింగ్లో పాల్గొన్నారు. 2వ రోజు మచిలీపట్నంలో 95, పెడనలో 47, అవనిగడ్డలో 93, పెనమలూరులో 112, గన్నవరంలో 93, గుడివాడలో 64, పామర్రులో 32 మంది హోమ్ ఓటింగ్ వేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 13,536 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. 14,640 మంది ఉద్యోగుల్లో 13,536 మంది మే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
భారత ఎన్నికల కమీషన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, పర్యవేక్షణను వివరించారు.
Sorry, no posts matched your criteria.