Andhra Pradesh

News June 23, 2024

AU: జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలు

image

ఏయూ పరిధిలో జులై 9 నుంచి జరగనున్న బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయించినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. ఏయూ పరిధిలో ఉన్న 58 బీఈడీ కళాశాలలకు పరీక్ష కేంద్రాలను మార్పు చేశామన్నారు. ప్రిన్సిపాల్స్ తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

News June 23, 2024

నాడు పార్వతీపురం ఆర్డీవో.. నేడు విజయనగరం కలెక్టర్..

image

విజయనగరం జిల్లా నూతన కలెక్టర్‌గా బీఆర్ అంబేడ్క‌ర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 2015 బ్యాచ్‌కు చెందిన ఈయన కాకినాడ ఆర్డీఓగా, కృష్ణ జిల్లా డీఆర్వోగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జేసీగా, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌గా, ఆప్కో ఎండీగా, పార్వతీపురం ఆర్డీఓగా, ఐటీడీఏ పీఓగా కూడా పని చేశారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా ఉన్నారు.

News June 23, 2024

NLR: 18 మంది ప్రత్యేక వైద్యుల తొలగింపు

image

నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 18 మంది ప్రత్యేక వైద్యులను తొలగించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, డెంటల్, పీడియాట్రిక్ తదితర నిపుణులను గతంలో నియమించారు. వీరు విధులకు సరిగా హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

News June 23, 2024

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి కర్నూలు వాసి ఆత్మహత్య

image

సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన కే.వీరనాగులు (46) స్థానికంగా కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సరైన ఉపాధి లేక మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం కుటుంబసభ్యులకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు.

News June 23, 2024

చిత్తూరు ఎంపీకి కీలక పదవి

image

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

News June 23, 2024

ప.గో.: రూ.400తో చికెన్ కొనుగోలు.. ఇంటికెళ్లాక దుర్వాసన

image

తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన మహ్మద్‌అలీ పెద్దమసీద్ కూడలిలోని ఓ దుకాణంలో రూ.400తో చికెన్ కొనుగోలుచేశాడు. ఇంటికెళ్లాక చూస్తే దుర్వాసన వచ్చింది. దీంతో షాప్‌కు వెళ్లి యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు వాపోయాడు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుచేయగా..తమ పరిధిలోకి రాదని చెప్పినట్లు సమాచారం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ASR.రెడ్డిని వివరణకోరగా సదరు దుకాణాల్లో తనిఖీలు చేస్తామన్నారు.

News June 23, 2024

విశాఖ: మంత్రి నారా లోకేశ్‌కు లేఖ

image

ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఐటి పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ లేఖ రాశారు. మిలీనియం టవర్లను 10 ప్రముఖ ఐటి కంపెనీలకు 3 సంవత్సరాలకు ఉచితంగా కేటాయించాలని, తద్వారా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హిల్ నెంబర్ 2,3లో ఉన్న పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని నూతన కంపెనీలకు 50 శాతం సబ్సిడీపై అందించాలని, నూతన ఐటీ పాలసీ అమలు చేయాలన్నారు.

News June 23, 2024

సమస్యల సుడిగుండంలో మైలవలం జలాశయం

image

కడప జిల్లాలోని ప్రముఖ మైలవరం జలాశయం పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కడప, కర్నూలు జిల్లాల పరిధిలోని 75 గ్రామాలకు ప్రతి రోజు 0.008 టీఎంసీల నీటిని అందిస్తోంది. అయితే జలాశయంపై నిర్మించిన 2.85 కి.మీ రహదారి పాడైందని, రక్షణ గోడ సైత చాలా వరకు కూలిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.

News June 23, 2024

విజయనగరం జోన్ పరిధిలో లీజ్‌కు ఆర్టీసీ స్థలాలు

image

విజయనగరం ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న తొమ్మిది ఆర్టీసి ఖాళీ స్థలాలను లీజ్‌పై ఔత్సాహిక వ్యాపారస్తులకు ఇవ్వనున్నామని డిప్యూటీ సిటీఎం బి.అప్పలనాయుడు తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఖాళీ స్థలాల లీజుకు ఆసక్తి చూపుతున్న శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 26 మధ్యాహ్నం 2 గంటల లోపు జోనల్ వర్క్ షాప్ వద్ద దరఖాస్తులు స్వీకరించి, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు.

News June 23, 2024

SKLM: అమానుష ఘటనలో ఐదుగురి అరెస్ట్

image

ఎచ్చెర్ల(M) నవభారత్ జంక్షన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. SI చిరంజీవి ఘటన జరిగిన శ్రీకాకుళం నగరం దమ్మల వీధిలో విచారణ చేపట్టారు. బాధితురాలిని అల్లిపల్లి రాధ, నీలిమ, కోడ భవాని, కుందు జయ, మైలపిల్లి కృష్ణవేణి చిత్రహింసలకు గురిచేయగా.. మరో ఇద్దరు బట్టలు విప్పి ఊరేగించారని పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.