Andhra Pradesh

News May 3, 2024

మంగళగిరి: బ్యాంక్ వద్ద తోపులాట.. గాయాలు

image

పెన్షన్ నగదు తీసుకునేందుకు బ్యాంక్‌ల వద్ద వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మంగళగిరి యూనియన్ బ్యాంకు వద్ద పెన్షన్ తీసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ఫించనుదారులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పెన్షన్ దారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో వృద్ధురాలికి గాయాలు అయ్యాయి.

News May 3, 2024

కడపకు రానున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి?

image

కడపకు ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రానున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్‌తో పాటు పలువురు నాయకులు రానున్నట్లు తెలుస్తోంది. కడప మున్సిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వీరు ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు.

News May 3, 2024

చెవిరెడ్డి దోపిడీ రూ.2 వేల కోట్లు: లోకేశ్

image

ఒంగోలు YCP MP అభ్యర్థి MLA చెవిరెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు. ‘చంద్రగిరిని ఐదేళ్లు దోచుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.2 వేల కోట్లు సంపాదించారు. ఆయన సినిమా అయిపోవడంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. శ్రీవారి దర్శన టికెట్లు, గంజాయి, ఎర్రచందనంతో బాగా సంపాదించారు. అందుకే ఆయనకు చెవిలో పువ్వు అని పేరు పెట్టా’ అని లోకేశ్ అన్నారు.

News May 3, 2024

విశాఖ ప్రధాన కూడళ్ళలో గ్రీన్ రూఫ్ ఏర్పాటు

image

విశాఖలోని పలు ప్రధాన జంక్షన్లో వేసవి తాపానికి గాను గ్రీన్ రూఫ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడంతో వాహనచోదకులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

News May 3, 2024

విజయనగరంలో నారా లోకేశ్ పర్యటన ఖరారు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల6న నారా లోకేశ్ విజయనగరం రానున్నారు. ఆరోజు జరిగే యువగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు. ఇక్కడ సభ అనంతరం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇప్పటికే ఈనియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రచారం చేశారు.

News May 3, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

image

జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.

News May 3, 2024

గుంటూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 44.0

image

గుంటూరులో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.0 డిగ్రీలుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా పలువురు వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

News May 3, 2024

టెక్కలిలో మహిళకు కరెంట్ షాక్

image

టెక్కలి- మెలియాపుట్టి రోడ్డులోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న పోలాకి సుందరమ్మ అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలయ్యాయి. మండాపోలం కాలనీకి చెందిన సుందరమ్మ మిల్లులో పని చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షా్క్ తగిలింది. గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

ఎన్నికల బరిలో ముగ్గురు రిటైర్డ్ IASలు

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.

News May 3, 2024

కైకలూరు ఎమ్మెల్యేకు గుండెపోటు

image

కైకలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయన హార్ట్ స్ట్రోక్ రాగానే వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ నాగార్జున నగర్‌లోని ఆయుష్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.