Andhra Pradesh

News June 23, 2024

కృష్ణా: డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధప్రసాద్..?

image

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు నడుస్తోంది. అయితే ఈ పదవిని జనసేన తీసుకునే విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు. అదే జరిగిదే అవనిగడ్డ MLA మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయిస్తారని టాక్. రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లు సమాచారం.

News June 23, 2024

హైదరాబాద్‌లో నెల్లూరు యువకుడి అరెస్ట్

image

నెల్లూరుకు చెందిన వెంకట సాయిచరణ్ ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు. చిన్నచిన్న ప్యాకెట్లు చేసి బస్సుల్లో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు పంపేవాడు. ఈ క్రమంలో స్వయంగా హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుండగా మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 23, 2024

భార్యాభర్తకు తిరుపతి పోలీసుల వేధింపులు..?

image

పోలీసులు తమను వేధిస్తున్నారని భార్యాభర్త వాపోయారు. మదనపల్లెకు చెందిన నితిన్, హిమజ గతంలో దొంగతనాలు చేశారు. తెలిసో తెలియక తప్పు చేశామని.. ఇప్పుడు తాము మంచిగా బతుకుతున్నామని చెప్పారు. కానీ చేయని నేరాలని ఒప్పుకోవాలంటూ తిరుపతి, కర్ణాటక పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. సమయం, సందర్భం లేకుండా తమను తీసుకెళ్లి గోళ్లు పీకడం, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

News June 23, 2024

నేటితో ముగియనున్న ఐటీఐ కౌన్సిలింగ్

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. ఐదో రోజు శనివారం 432 మంది విద్యార్థులను పిలవగా 211 మంది హాజరయ్యారు. వారిలో 98 మందికి వివిధ కళాశాలలో సీట్లు లభించింది. ఆఖరి రోజు 2,306 ర్యాంకు నుంచి 2,470 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

News June 23, 2024

ప.గో.: డిప్యూటీ స్పీకర్‌గా బొలిశెట్టి శ్రీనివాస్..?

image

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు నడుస్తోంది. అయితే ఈ పదవిని జనసేన తీసుకునే విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు. అదే జరిగిదే తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్‌కు కేటాయిస్తారని టాక్. రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లు సమాచారం.

News June 23, 2024

డిప్యూటీ స్పీకర్‌గా లోకం నాగ మాధవి?

image

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేరును ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బుద్ధ ప్రసాద్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని పవన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో స్పష్టత రానున్నట్లు సమాచారం.

News June 23, 2024

విశాఖ మన్యంలో మిస్టరీ మరణాలు..!

image

అల్లూరి జిల్లాలో ఇద్దరి మరణాలు మిస్టరీగా మారాయి. పెదబయలు మండలం చుట్టుమెట్టలో కాఫీతోటలకు వెళ్లిన ఓ మహిళ అపస్మారకస్థితిలోకి చేరుకుంది. దీంతో ఆమె సోదరుడు భూత వైద్యుడు సహదేవ్ వద్దకు తీసుకెళ్లాడు. వైద్యం చేస్తుండుగా.. మహిళ చెయ్యి పట్టుకున్న ఆమె తమ్ముడు త్రినాథ్, భూత వైద్యుడు సహదేవ్ ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. ఆ మహిళ కొంతసేపటికి తేరుకుంది. ఈనెల 19న జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

News June 23, 2024

కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పూర్తికి కృషిచేస్తా: MP

image

కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషిచేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పేర్కొన్నారు. లోక్‌సభ టీడీపీ విప్‌గా పార్టీ అధినేత చంద్రబాబు నియమించిన సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ .. తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్ కాయర్ బోర్డ్ ద్వారా పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.

News June 23, 2024

కారంచేడు: ఉద్యోగం ఆశ చూపి రూ.5.30 లక్షల మోసం

image

మాయగాళ్ల బారిన పడి అలేఖ్య అనే యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. పోలీసుల వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన జాగర్లమూడి అలేఖ్య అనే యువతి ఉద్యోగ వేటలో ఉండగా తన వాట్సప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఉద్యోగం ఆశచూపి వారు అడిగినంత మొత్తం రూ.5.30 లక్షలు చెల్లించింది. చివరకు ఆ గ్రూపు డిలీట్ కావడంతో అలేఖ్యకు మోసం అర్థమైంది. గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై సురేష్ తెలిపారు.

News June 23, 2024

రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి మంత్రిగారు: నారా లోకేశ్

image

నిన్న జరిగిన శాసనసభ అనంతరం లాబీ వద్ద మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి వచ్చారు. దీంతో వారు ఇద్దరు పలకరించుకోని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. అనంతరం లోకేశ్ మంత్రిగారూ.. త్వరగా ఎయిర్ పోర్ట్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయనను అడిగారు. వెంటనే కేంద్ర మంత్రి రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పాగా.. రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి అని లోకేశ్ కోరారు.