India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సదుం మండలం ఎర్రాతివారిపల్లె, పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటనలో గొడవలు జరిగాయి. వీటిని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పలమనేరులోనూ వంద శాతం వెబ్కాస్టింగ్ చేస్తామన్నారు.
దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన మైలా ఏసన్న (53) అనే వ్యక్తి గురువారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఏసన్న ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గురువారం కూలి పనికి ప్రొద్దుటూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏసన్న స్పృహ తప్పడంతో తోటి కూలీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.
గుంటూరు మార్కెట్ యార్డుకు ఈనెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ యార్డులోని కార్మిక సంఘాలు, దిగుమతి వ్యాపారుల సంఘం అభ్యర్థన మేరకు
వేసవి కాలంలో ఎండ తీవ్రత కారణంగా వేసవి సెలవులు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు తమ సరుకును ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే యార్డులోకి తీసుకురావాలన్నారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఈనెల 10న జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లువిక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు.ఈనెల 7వ తేదీ సాయంత్రం వరకు విక్రయాలు సింహాచలం మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్రాంచ్ లలో టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు.కొండపై కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో ఈనెల 1వ తేదీన టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కొట్లాట సమాచారం మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, భీమిలి సీఐ డి.రమేష్ తదితరులు ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి గ్రామంలో భద్రత ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఇరు వర్గాలకు చెందిన పదిమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించే డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ థియరీ పరీక్షలను మే 13న ఎన్నికల నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాస్ వివరాల మేరకు.. ముంబయికి చెందిన లలిత్ కుమార్ సింఘాల్(57) చెన్నైలో పని చేస్తున్నారు. తన భార్య అంజూ శింఘాల్తో కలిసి కారులో శ్రీకాళహస్తి వైపుకు వస్తుండగా మేర్లపాక వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా భార్యాభర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
బద్వేలులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ MLA కమలమ్మ తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కడప పర్యటనలో ఉన్న చంద్రబాబును గురువారం ఆమె కలిశారు. మరి కొద్దిరోజుల్లో టీడీపీ కండువా కప్పుకుంటారని ఆమె వర్గీయులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరైన గుర్తింపు లేకపోవడంతోనే కమలమ్మ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల (సూక్ష్మ పరిశీలకులు) పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల పరిశీలకులు, సీనియర్ శేఖర్ విద్యార్థి అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన గురువారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించారు. అబ్జర్వర్లు పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఎక్కడైనా తప్పిదాలు ఉల్లంఘనలు జరిగితే అధికారులకు చెప్పాలన్నారు.
EVMలను ఏ విధంగా ఉపయోగించాలో జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు కాకినాడ కలెక్టర్ నివాస్ తెలిపారు. గురువారం ఆయన జగ్గంపేటలోని మోడల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. జిల్లాలో 16,34,122 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు.
Sorry, no posts matched your criteria.