Andhra Pradesh

News June 22, 2024

బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బదిలీ

image

బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బదిలీ అయ్యారు. ఆయనను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్‌కు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. నూతన కలెక్టర్ నియమితులయ్యే వరకు ఈయనే బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

News June 22, 2024

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు బదిలీ

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీరావును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి. సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

News June 22, 2024

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ

image

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ మల్లికార్జునను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌కు కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్ బదిలీ అవుతారని వెలువడిన ఊహాగానాలు నిజమయ్యాయి.

News June 22, 2024

కర్నూల్ జిల్లా కలెక్టర్ బదిలీ

image

కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. జిల్లాకు కొత్త కలెక్టర్‌గా పి.రంజిత్ బాషాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.

News June 22, 2024

BREAKING: ప్రకాశం జిల్లా కలెక్టర్ బదిలీ

image

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.ఎస్.దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్‌గా తమీమ్ అన్సారియాను ప్రభుత్వం నియమించింది.

News June 22, 2024

BREAKING: గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు గుంటూరు కలెక్టర్‌గా పని చేసిన వేణుగోపాల్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నూతన కలెక్టర్‌గా నియమితులైన నాగలక్ష్మి గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేశారు.

News June 22, 2024

చిత్తూరు కలెక్టర్‌గా సుమిత్ కుమార్

image

చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టర్ సగిలి సన్మోహన్‌ను కాకినాడ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పశ్చిమ గోదావరి కలెక్టర్‌ సుమిత్ కుమార్‌ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు.

News June 22, 2024

తూ.గో: ఉరివేసుకుని యువకుడి SUICIDE

image

యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన శనివారం తాళ్లపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరన్నస్వామి(26) రాజమండ్రిలోని దివాన్ చెరువు నుంచి వచ్చి తాళ్లపూడిలోని ఓ హోటల్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కారణమేంటో తెలియదు గానీ వీరన్న సూసైడ్ చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు తరలించినట్లు ఎస్సై శ్యామ్ తెలిపారు.

News June 22, 2024

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి కీలక పదవీ

image

TDP పార్లమెంటరీ కోశాధికారిగా నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై నమ్మకంతో TDP పార్లమెంటరీ పార్టీ ట్రెజరర్‌గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

News June 22, 2024

ప.గో: ఉరివేసుకుని యువకుడి SUICIDE

image

యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన శనివారం తాళ్లపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరన్నస్వామి(26) రాజమండ్రిలోని దివాన్ చెరువు నుంచి వచ్చి తాళ్లపూడిలోని ఓ హోటల్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కారణమేంటో తెలియదు గానీ వీరన్న సూసైడ్ చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు తరలించినట్లు ఎస్సై శ్యామ్ తెలిపారు.