Andhra Pradesh

News May 2, 2024

అన్నమయ్య జిల్లాకు ప్రధాని మోదీ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొననున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే పీలేరు కూటమి అభ్యర్థిగా కిరణ్ తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి బరిలో ఉండటంతో పీలేరులో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

News May 2, 2024

చీరాల వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

image

చీరాలలో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరల వాసులకు కీలక హామీలు ఇచ్చారు. చీరాలలో చేనేతలకు టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం. వాడరేవు బీచ్‌లకు పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి. తాగునీటి సమస్య పరిష్కారం. తోటవారి ఎత్తిపోతల పథకానికి సురక్షిత నీరు అందించడం. పేరాల, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జిల నిర్మాణం. చీరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News May 2, 2024

ఏ.కొండూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మండలంలోని కృష్ణారావు పాలెంలో గురవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ గురువారం ఢీకొన్నాయి. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా
స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

News May 2, 2024

నెల్లూరు: 41.7 డిగ్రీల ఎండతో జనం విలవిల

image

నెల్లూరులో బుధవారం 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యప్రతాపం తీవ్రమవుతుండటంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. 11 గంటలకు ఖాళీ అవుతున్న రోడ్లు తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాతే రాకపోకలతో రద్దీగా కనిపిస్తున్నాయి. రోడ్ల పక్కన చిరువ్యాపారులు చేసుకునేవారు. రోజు కూలీలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే జీవన పోరాటం సాగిస్తున్నారు.

News May 2, 2024

రాజమండ్రి వస్తున్న బస్సులో రూ.2.40 కోట్లు దొరికాయ్..!

image

హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న బస్సులో భారీగా నగదు దొరికింది. ప.గో జిల్లా జగన్నాథపురం చెక్‌పోస్ట్ వద్ద రూ. 2.40 కోట్లు తరలిస్తుండగా పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ బస్సులో ఆ నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

జీలుగుమిల్లి గిరిజన సంక్షేమాధికారి సస్పెన్షన్

image

జీలుగుమిల్లి సహాయ గిరిజన
సంక్షేమాధికారి (ఏటీడబ్ల్యూవో) కె.కృష్ణమోహన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఆ శాఖ ఉప సంచాలకుడు పీవీఎస్ నాయుడు తెలిపారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఫిబ్రవరిలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటనతో పాటు పలు అంశాలపై ఐటీడీఏ పీవో డైరెక్టరేటుకు నివేదిక పంపగా సస్పెండ్ చేసినట్లు డీడీ పేర్కొన్నారు.

News May 2, 2024

కర్నూలు: బాలికపై యువకుడి లైంగిక వేధింపులు

image

బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చిప్పగిరి మండలంలో జరిగింది. ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ వివరాల మేరకు.. నాగరాజు అనే 30 ఏళ్ల యువకుడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను కట్టేసి, నోటిలో గడ్డలు కుక్కి లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు రావడంతో నిందితుడు పారిపోయాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని గాలించి ఆదపులోకి తీసుకుంటామన్నారు.

News May 2, 2024

అరకు, అనకాపల్లిలో గడ్కరీ ప్రచారం

image

విశాఖ ఎయిర్ పోర్టుకు శుక్రవారం 10:45కు నితిన్ గడ్కరీ రానున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని సుందరనారాయణపురం హెలికాఫ్టర్‌లో వెళ్ళనున్నారు. ఉదయం 11:30కు అరుకు పార్లమెంటు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖకు హెలికాప్టర్లో చేరుకుని, సాయంత్రం 4:30కి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలో నితిన్ గడ్కరీ పాల్గొంటారు. సాయంత్రం 6:15కు విశాఖ నుంచి బయలుదేరి నాగపూర్ వెళ్తారు.

News May 2, 2024

అనంతపురం జిల్లా టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

image

టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తమ్మినేని నటేస్ చౌదరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాయదుర్గం నుంచి మాజీ జడ్పీ ఛైర్మన్ పులా నాగరాజును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

News May 2, 2024

చిత్తూరు జైలుకు నాయకుల తరలింపు

image

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో 9 మంది బీసీవై నాయకులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత సోమవారం ఎర్రాతివారిపల్లెలో అనుమతి లేకుండానే బీసీవై నాయకులు ప్రచారానికి వెళ్లడంతో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది బీసీవై నాయకులు, అలాగే 9 మంది వైసీపీ నాయకులకు రిమాండ్‌ విధించగా.. వారిని చిత్తూరు జైలుకు తరలించారు.