India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో 9 మంది బీసీవై నాయకులను రిమాండ్కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత సోమవారం ఎర్రాతివారిపల్లెలో అనుమతి లేకుండానే బీసీవై నాయకులు ప్రచారానికి వెళ్లడంతో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది బీసీవై నాయకులు, అలాగే 9 మంది వైసీపీ నాయకులకు రిమాండ్ విధించగా.. వారిని చిత్తూరు జైలుకు తరలించారు.
జిల్లాలోని ఈ కింది మండలాల్లో గురువారం వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఆయా మండలాల్లోని ప్రజానీకం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.
* చందర్లపాడు
* జి కొండూరు
* గంపలగూడెం
* ఇబ్రహీంపట్నం
* కంచికచర్ల
* నందిగామ
* మైలవరం
* వీరులపాడు
* విజయవాడ రూరల్
* విజయవాడ అర్బన్
* విస్సన్నపేట
నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిపై బ్యారేజీ నిర్మించిన నేపథ్యంలో పాత ఆనకట్ట తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాత ఆనకట్టకు 450 మీటర్ల దిగువన బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఈక్రమంలో బ్యారేజీలో నీటిని నిల్వలను లెక్క కట్టడంలో తేడా రావడంతో పాటు బీరాపేరు పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈక్రమంలో పాత ఆనకట్టను తెలుగుగంగ ఎస్ఈ వెంకటరమణారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ ఆనకట్టను 1882లో కట్టారు.
జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ 70శాతం పూర్తిచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పింఛన్దారుల ఖాతాల్లోకి మొదటి రోజే దాదాపు నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2,88,334 మందికి రూ.86.332 కోట్ల పింఛన్ మొత్తం విడుదలైందన్నారు. ఆధార్ అనుసంధానమైన 2,02,716 మంది పింఛన్దారులకు ఖాతాల్లోకి రూ.60.815 కోట్లు జమ చేస్తామన్నారు. 85,618 మంది ఇళ్ల వద్దకు వెళ్లి రూ. 25.517 కోట్లు పంపిణీ చేశామన్నారు.
బుట్టాయిగూడెంకు చెందిన బొబ్బర వంశి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఝాన్సీ (38) ని 2ం ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఝాన్సీ పట్టణములోని ఓ ఆసుపత్రిలో వర్కర్ గా పనిచేస్తుంది. భర్త చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. దీంతో ఇల్లు అమ్మేయాలని భార్యతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. బుధవారం కత్తితో భార్యను చంపి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజుపేట జంక్షన్ వద్ద హెలికాప్టర్ దిగి, అక్కడి నుంచి తన కాన్వాయ్లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం తూ.గో జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 1,306 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మే 2, 8వ తేదీల్లో రెండు విడతల్లో ఈ ఓటింగ్ జరుగనుంది. దీని కోసం అధికార యంత్రాంగం సమాయత్తమైంది. తొలి విడతగా మే 2న, మిగిలిన వారికి రెండో విడతగా మే 8న ఓటు వేసే అవకాశం కల్పించారు.
బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధాపై వైఎస్ షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బద్వేల్ ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు కదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుండంటా.. కొండలు, గుట్టలు ఏదీ వదిలిపెట్టడం లేదంటకదా’ అని విమర్శనాస్త్రాలు గుప్పించారు. షర్మిల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం.
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఒంగోలు వస్తుండగా కొరిసపాడు మండలంలోని రేణింగవరం వద్ద కారు టైర్ పగిలి అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మూడో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు 20వ తేదీలోగా సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కు దరఖాస్తు చేసుకోవాలని.. వివరాలకు 9490957021లో సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.