India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో వైద్యుని కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇంట్లో ఉన్న రూ.16 లక్షలు, 300గ్రా. బంగారాన్ని శ్రీనివాస్ కారులో పెట్టాడు. కారు తాళాన్ని ఎదురింటి గేటు బాక్సులో పెట్టి అన్నయ్య వస్తే తాళం ఇవ్వాలని చెప్పాడు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా శ్రీనివాస్ పోర్టికోలో ఉరేసుకొని ఉన్నాడు. అనంతరం బాక్స్లో కారుతాళం చూడగా కాగితానికి తాళం అన్నకు ఇవ్వాలని ఫోన్ నంబర్ రాసి ఉంది.
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. వీరికి తోడుగా పార్టీ అధినేతలు జిల్లాకు క్యూ కట్టారు. ఏప్రిల్ 28, 30న జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. శుక్రవారం కనిగిరిలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజు పొదిలిలో చంద్రబాబు నాయుడు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఒకే రోజు జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిధిలోని హాస్టల్స్ కు ఈనెల 11వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ జి.వీర్రాజు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు వసతి గృహాలను ఖాళీ చేసి, సెక్యూరిటీ గార్డులకు స్వాధీనం చేయాలని దాంట్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఈ వసతిగృహాలను కేటాయించే అవకాశం ఉంది.
కాకినాడ జీజీహెచ్లో మత్తు ఇంజెక్షన్లు దొంగిలిస్తూ 42 ఏళ్ల వ్యక్తి పట్టుబడ్డాడు. డ్రగ్స్ కు బానిసైన అతను కొంతకాలంగా రోగులకు నొప్పి ఉపశమనానికి ఇచ్చే ఇంజెక్షన్లు దొంగిలించి వాటిని వినియోగిస్తుండేవాడు. జీజీహెచ్ క్యాన్సర్ వార్డ్లోకి చొరబడి రోగులకు ఇచ్చేందుకు భద్రపరిచిన ఎవిల్ ఇంజెక్షన్లను అపహరిస్తుండగా ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మత్స్యకారులకు చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం చెల్లిస్తున్న జీవన భృతికి ఎన్నికల కమిషన్ అనుమతితో గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రారంభించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం జీవో ద్వారా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిషేధ కాలంలో వారికి ప్రభుత్వం జీవనభృతిగా రూ.10 వేలు అందిస్తుంది.
సింహాచలం అప్పన్న బాబు చందనోత్సవ కార్యక్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తెలిపారు. ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని చందనోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అదనంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ నేడు విజయనగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సభ జరగుతుందని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. చీపురుపల్లిలో జరిగే సభ అనంతరం కొత్తపేట నీళ్ల ట్యాంకు, అంబటి సత్రం కూడలి, మూడు లాంతర్ల కూడలి మీదుగా సభస్థలానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న విశాఖ చేరుకున్నారు.
బూర్జ మండలంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని లాభాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(40) భార్య 6 నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుమారుడు రేవంత్ (12) బాగోగులు చూసుకునేవారు లేకుండా పోయారు. ఈ క్రమంలో మనస్తాపంతో ఉంటున్న అప్పలనాయుడు కుమారుడికి ఉరి వేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప.గో జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్గా సేవలందిస్తున్నా హేమ కుమారి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మే 3న అమెరికా ఐక్యరాజ్య సమితిలో నిర్వహిస్తున్న 57వ మకిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. హేమ కుమారి 2022లో కాకినాడ జేఎన్టీయూ ఎంటెక్ పట్టా పొందారు. జేఎన్టీయూలో ఐదేళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్గా పనిచేశారు.
విశాఖ జిల్లాలో దక్షిణ నియోజకవర్గం పోలింగ్లో కాస్త భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ బరిలో 16 మంది అభ్యర్థులున్నారు. నోటాతో కలిపి ఈ సంఖ్య 17కు చేరడంతో రెండు బ్యాలెన్స్ యూనిట్లను వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కో ఈవీఎం యూనిట్లో 16 మంది పేర్లు మాత్రమే పెట్టవచ్చు, నోటాకు మరొక యూనిట్ అవసరం ఏర్పడుతుంది. దీనితో దక్షిణ నియోజకవర్గానికి అదనంగా 284 బ్యాలెట్ యూనిట్లు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.