India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమ చెల్లెల్ని పుట్టింటికి పంపలేదన్న కోపంతో బావపై బావమరుదులు దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఆదర్శనగర్కు చెందిన అబ్దుల్లా భార్య పుట్టింటికి వెళతానని అడుగగా పంపలేదు. ఈ విషయాన్ని తన అన్నలకు చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు శనివారం అర్ధరాత్రి బావ అబ్దుల్లాపై కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్లాను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కూరగాయల ధరలు అమాంతంగా పెరగడంతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం ఉల్లి, టమాటా, బంగాళాదుంపల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి టోకు వర్తకులు, మార్కెటింగ్, పౌరసరఫరా అధికారులతో చర్చించారు. ఆర్ అండ్ బీ, దాసన్న పేట, ఎంఆర్ రైతు బజార్లలో టమాటా కిలో రూ.60, ఉల్లి రూ.35, బంగాళాదుంపలు కిలో రూ.30కు అమ్మాలని నిర్ణయించారు.

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణను అర్చకులు వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామికి విశేష పూజలు చేశారు. అక్షయ తృతీయనాడు మొదట విడత, వైశాఖ పౌర్ణమి నాడు రెండో విడత చందన సమర్పణ జరగగా నాలుగవ విడత జూలై 21వ తేదీన జరుగుతుందని ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ తెలిపారు.

కాకినాడ సిటీ MLAగా వనమాడి వెంకటేశ్వర రావు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ను కలిసి కరచాలనం చేశారు. శుక్రవారం అనివార్య కారణాల వల్ల వనమాడి అసెంబ్లీకి వెళ్లని విషయం తెలిసిందే.

తిరువన్నామలై దర్శనం కోసం వెళ్తున్న తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్, రెడ్డిగుంటకు చెందిన భక్తుల బృందానికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎనిమిది మంది గాయాలయి తిరువన్నామలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రాథమిక సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ఆచంట MLAగా పితాని సత్యనారాయణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ను కలిసి కరచాలనం చేశారు. శుక్రవారం అనివార్య కారణాల వల్ల పితాని అసెంబ్లీకి వెళ్లని విషయం తెలిసిందే.

ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ హెచ్చరించారు. అలాగే ఫీజులకు సంబంధించిన వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో ఉంచాలని తెలిపారు. పాఠశాలల్లో పుస్తకాలు అమ్మకూడదని అన్నారు. వీటిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

మండల పరిధిలోని ఐతవరం గ్రామ శివారు సచివాలయం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఓ వ్యక్తి సైకిల్ మీద వెళుతుండగా.. గుర్తు తెలియనిది ఓ వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు నందిగామ స్టేషన్ను సమాచారం ఇవ్వాలని కోరారు.

తిరువన్నామలై దర్శనం కోసం వెళ్తున్న తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్, రెడ్డిగుంటకు చెందిన భక్తుల బృందానికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎనిమిది మంది గాయాలయి తిరువన్నామలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రాథమిక సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

గూడూరు మండలం విందూరు వద్ద ఆర్ & బీ రోడ్డు మీద ఉన్న కల్వర్టు కుంగడంతో అటుగా వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గూడూరు వచ్చేందుకు దగ్గర మార్గం ఇదొక్కటే కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ కల్వర్ట్ నిర్మించిన తక్కువ కాలంలోనే ఇలా జరగడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.