Andhra Pradesh

News May 1, 2024

నంద్యాల: వడదెబ్బతో యువతి మృతి

image

వడదెబ్బతో యువతి మృతిచెందిన ఘటన చాగలమర్రి మండల పరిధిలోని పెద్ద బోధనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన రాజా, శివమ్మ దంపతుల కుమార్తె డొంక సంధ్య(22) వడదెబ్బ కారణంగా విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News May 1, 2024

రేపు 12 మండలాల్లో వడగాల్పులు: కలెక్టర్

image

కాకినాడ జిల్లాలోని 12 మండలాల్లో గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెదపూడి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్నారు. తుని మండలంలో బుధవారం 41.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది అన్నారు.

News May 1, 2024

విశాఖలో ఎస్.కోట వాసి దారుణ హత్య

image

డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

అనంత: పాము కాటుకు గురై మహిళ మృతి

image

డీ.హీరేహల్ మండలం మురడి గ్రామానికి చెందిన కవితమ్మ(35) పాము కాటుకు గురై మృతిచెందినట్లు ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి బుధవారం తెలిపారు. 29న భర్త, కుమారుడితో పాటు ఆరుబయట పడుకున్న సమయంలో పాము కాటుకు గురైంది. వెంటనే ఆమెను బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. భర్త దాసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈమెకు ముగ్గురు కుమారులు.

News May 1, 2024

కృష్ణా జిల్లాలో వేగంగా ఓటరు స్లిప్‌ల పంపిణీ

image

జిల్లాలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 15,39,460 మంది ఓటర్లకు గాను ఏప్రిల్ 30వ తేదీ వరకు 3,83,520 మందికి స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. గన్నవరంలో 60,834, గుడివాడలో 36,312, పెడనలో 54,096, మచిలీపట్నంలో 64,823, అవనిగడ్డలో 56,287, పామర్రు 54,382, పెనమలూరులో 56,786మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామన్నారు.

News May 1, 2024

సారవకోట: శతాధిక వృద్ధురాలి మృతి

image

సారవకోట మండలం కుమ్మరి గుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారావమ్మ (104) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమె స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పెద్దతల్లి. ఈమె మృతితో ధర్మాన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈమె అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

News May 1, 2024

సీఎం పర్యటనను విజయవంతం చేయండి: చెవిరెడ్డి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 3వ తేదీన కనిగిరికి రానున్నట్లు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News May 1, 2024

ఒంటిమిట్ట: రైలు ఢీకొని YCP కార్యకర్త మృతి

image

ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సొంట సుశాంత్ బుధవారం ప్రమాదవశాత్తు రైలు పట్టాలు దాటుతూ ఉండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 1, 2024

డుంబ్రిగుడలో దారుణ హత్య

image

డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే  ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

విజయవాడలో జ్యోతి సురేఖకు ఘన సన్మానం

image

విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు చైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్చరీ పోటీలలో వ్యక్తిగత, జట్టు, మిక్స్డ్ విభాగాలలో 3 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం శాప్ కార్యాలయంలో రాష్ట్ర క్రీడల ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి సత్కరించారు. ఆయన సురేఖ విజయం దేశానికే గర్వకారణం అని అన్నారు.