India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోక్సో కేసులో రామభద్రపురం మండలంలోని కోటశిర్లాం గ్రామానికి చెందిన నిందితుడు గర్బాపు వినయ్ కుమార్కు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొబ్బిలి రూరల్ సీఐ తిరుమలరావు మాట్లాడుతూ.. 2020లో బాలికను మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో జడ్జి నాగమణి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందు కోసం జిల్లాలో 35 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 85సం పైబడిన వారు, 40% పైబడి అంగవైకల్యం కలిగి హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ బృందాలు వెళ్లి ఓటు వేయించనున్నాయి. ఒక్కో బృందంలో ఒక PO, APO, వీడియో గ్రాఫర్ ఉంటారు. 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుందని తెలిపారు.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 18సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 12సార్లు గెలవగా.. TDP 3సార్లు, YCP 2 సార్లు గెలిచింది. ప్రస్తుతం TDP తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, YCP నుంచి వి.విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కొప్పుల రాజు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి
మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు పాడుబడిన భవనంపై భక్తులు నిలబడి ఉండడంతో భవనం ముందు భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీల వ్యవహరించాలని పార్లమెంటరీ ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఖర్చులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈనెల 6, 10వ తేదీలలో అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేస్తామన్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ రెడ్డి దుస్తులను ఇస్త్రీ చేశారు. బుధవారం ఆయన ఇందుకూరుపేటలో ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు.
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన రమేశ్(40) గంగజాతర సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం బోయకొండ రోడ్డులో ఉన్న సిద్ధప్ప బావి వద్ద ఈతకు వెళ్లినట్లు మృతి చెందాడు. సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశామని అన్నారు.
విజయవాడ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ ఎన్నికల పర్యవేక్షకులు రాజ్ పాల్, నరేందర్ సింగ్తో కలిసి ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి ర్యాండమైజేషన్లో ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటాయించగా, 2వ ర్యాండమైజేషన్లో ఈవీఎంలను ఆన్లైన్లో ద్వారా పోలింగ్ స్టేషన్లకు అనుసంధానించాలని తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నెల్లూరులో యువగళం నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన నాయకులను గెలిపించాలని అన్నారు. జిల్లాకు పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులు, యువకులు, ప్రజలతో మమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పారు.
సీఎం జగన్ ఈ నెల 3న క్రోసూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. సభా స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్ల గురించి స్థానిక పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.