Andhra Pradesh

News March 15, 2025

తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

image

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్‌ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

News March 15, 2025

ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి: మంత్రి

image

విజయనగరం మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్కులర్ ఆక్వా కల్చర్ విధానాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమన్నారు. వెలుగు 2.0 ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

News March 15, 2025

గాజువాకలో బాలికపై అత్యాచారయత్నం..!

image

గాజువాకలో మైనర్‌పై అత్యాచారయత్నం కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై దాడి భాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చిన్నారి వారికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భాను ప్రకాష్‌ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

News March 15, 2025

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తున్నారో తెలుసా?

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 183 ఎగ్జామ్ సెంటర్లలో 29,602 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లుగా డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. బాలురు 14,994 మంది, బాలికలు 14,608 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లుగా వెల్లడించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.

News March 15, 2025

పెంటపాడు: ఐరన్ ప్లేట్ మీద పడి వ్యక్తి మృతి

image

బరువైన ఐరన్ ప్లేట్ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ప్రత్తిపాడులో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్(38) ఈ నెల 13న ప్రత్తిపాడులోని ఓ పేపర్ మిల్లులో ఇనుప వస్తువులు తొలగించే పని మీద వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన్‌పై బరువైన ఇనుప ప్లేట్ పడటంతో మృతి చెందాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు విషయం ఎవరికీ తెలియరాలేదు.

News March 15, 2025

VZM: కన్న తండ్రి ముందే విషం తాగి మృతి

image

దొంగతనం నింద తనపై మోపారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భోగాపురం మండలం అమకాంలో ఈనెల 11న చోటుచేసుకోగా సదరు యువకుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా బావించి పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 15, 2025

ఎచ్చెర్ల : రోడ్డు ప్రమాదంలో చెన్నై వాసి మృతి

image

జరజాం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బి.ఆకాశ్(35) శ్రీకాకుళం నుంచి విశాఖకు కారులో వెళ్తూ.. జరజాం జంక్షన్ సమీపంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 15, 2025

ఒంటిపూట నిబంధన పాటించకుంటే చర్యలు: డీఈవో

image

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 15, 2025

VZM: ఇంకా ఒక్కరోజే టైం.. ALL THE BEST

image

పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST

News March 15, 2025

గుంటూరు ఛానల్‌లో గల్లంతైన బాలుడి మృతి 

image

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్‌లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్‌కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు.