India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులను, అర్జీలను రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, సాధారణ ప్రజలు సమస్య తీవ్రతను బట్టి తనను నేరుగా లేదా, ఫోన్ 9032923131 ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం తడ.. బివి పాలెం చెక్ పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాండిచ్చేరి నుంచి నెల్లూరుకి మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 కేసుల మద్యం (14,400 క్వార్టర్ బాటిళ్ల) మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు రూ.7,42,000 ఉంటుందని అంచనా.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో అచ్యుతాపురం చేరుకున్నారు. ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మద్ధతుగా సాయంత్రం 3 గంటలకు అచ్యుతాపురంలో జరిగే సభలో పాల్గొననున్నారు. అక్కడ నుంచి పెందుర్తి జంక్షన్లో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
తూ.గో జిల్లాలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీలో నిలిచిన అభ్యర్థుల, వారి ప్రతినిధుల సమక్షంలో “ఈవీఎం- ర్యాండమైజేషన్” ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజమండ్రి పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలలో అత్యంత పారదర్శకంగా ఈవీఎమ్ల ర్యాండమైజేషన్ ఆయా అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా.కే.విజయపార్వతీ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహించిన డా.బగాది జగన్నాథరావు మంగళవారం పదవీ విరమణ చేసిన సంగతి అందరికీ విదితమే.
చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీలు గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని, తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని, వేరే రాష్ట్రాలలో విలువ మరింత ఎక్కువ ఉంటుందన్నారు.
ప.గో. జిల్లా ఇరగవరం మండల కేంద్రంలో విషాదం జరిగింది. మండలంలోని గోటేరు గ్రామానికి చెందిన రెడ్డిమిల్లి రక్షిత రాజు (8), మురాల మహి కలువ పువ్వులు కోసేందుకని స్థానిక చెరువులో దిగారు. ఈ క్రమంలో రక్షిత రాజు గల్లంతయ్యాడు. స్థానికులు విషయం తెలుసుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.
హోం ప్రక్రియ ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సుమారు 15,509 మంది దివ్యాంగులు, 5వేల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు వెల్లడించారు. వారికి ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో హోం ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 45మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు.
BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధీశ్వరి గురువారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు మారంపల్లిలో యాత్ర ప్రారంభమై గున్నంపల్లి మీదుగా కప్పలగుంట చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్లజర్ల మండలంలోని గంటావారిగూడెం, దూబచెర్ల , నల్లజర్ల మీదుగా రాత్రి 9 గంటలకు పోతవరం చేరుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.