Andhra Pradesh

News May 1, 2024

పిఠాపురం: దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తా: దొరబాబు

image

సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్పచారంపై సైబర్ పోలీసులకు  ఫిర్యాదు చేస్తానని పిఠాపురం MLA పెండెం దొరబాబు మంగళవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిందన్నారు. అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు.

News May 1, 2024

గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత లోకేశ్‌ది: బ్రాహ్మణి

image

డ్వాక్రా పేరు చెబితే CBN ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే లోకేశ్ అలా గుర్తుకొస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళవారం సాయంత్రం దుగ్గిరాల మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. లోకేశ్‌ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి.. నియోజకవర్గం అభివృద్ధి లోకేశ్ బాధ్యతని బ్రాహ్మణి చెప్పారు. పసుపు మిల్లును సందర్శించి పసుపు కొమ్ముల నుంచి పసుపును ఎలా తయారు చేస్తారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

News May 1, 2024

నారా లోకేశ్‌తో వీపీఆర్ భేటీ

image

నెల్లూరు పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు స్థానంలో రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. వీపీఆర్ వెంట నెల్లూరు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు.

News May 1, 2024

తాడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడి మృతి

image

తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వస్తున్న బాలుడిని JCB ఢీకొగా ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News May 1, 2024

ఉద్యోగులకు నెల్లూరు కలెక్టర్ సూచనలు

image

ఈసీ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనే పోస్టల్‌బ్యాలెటు ఓట్లు వినియోగించుకోవాలని కలెక్టర్ హరి నారాయణన్‌ సూచించారు. మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంటుకు, అసెంబ్లీకి రెండు ఓట్లు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

News May 1, 2024

చీరాలలో చంద్రబాబు ప్రసంగంపై ఉత్కంఠ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చీరాలకు వస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.  చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. తాజాగా బలరాం కుమారుడు వెంకటేశ్ చీరాల నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో  బలరాం, వెంకటేశ్‌పై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 

News May 1, 2024

NLR: గిరిజన గురుకులాల్లో అడ్మిషన్లు

image

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మూడో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాణి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో HMలకు నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. మే 30న లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News May 1, 2024

వైసీపీ నేతల నుంచి నాకు రక్షణ కల్పించండి: కర్నూలు స్వతంత్ర అభ్యర్థి

image

వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కర్నూలు స్వతంత్ర అభ్యర్థి ఎస్.ఇంతియాజ్ బాష ఆరోపించారు. రాత్రి 12 గంటల సమయంలో వైసీపీకి చెందిన ఇద్దరూ గరీబ్ నగర్‌లోని తన ఇంటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని అన్నారు. ఈ విషయమై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం బాధితుడు ఫిర్యాదు చేశారు.

News May 1, 2024

శ్రీసత్యసాయి: ముళ్ల పొదలో అప్పుడే పుట్టిన మగ బిడ్డ

image

రొద్దం మండలం పెద్దగువ్వలపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ముళ్లపొదలో అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికులను కలిచివేస్తుంది. గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

News May 1, 2024

భీమవరం వచ్చిన నటి ఈషారెబ్బ

image

తెలుగు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. బంధువులతో కలిసి ఆలయానికి వచ్చిన వారు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.