Andhra Pradesh

News June 21, 2024

శ్రీకాకుళం మహిళలకు వసతి భోజనంతో శిక్షణ

image

ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 25 నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళల కోసం టైలరింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలో ఉన్న శిక్షణ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు అర్హులని అన్నారు.

News June 21, 2024

ఆ వైసీపీ కార్యాలయాలను కూల్చివేయాలి: విశాఖ కార్పొరేటర్

image

విశాఖ నగరం ఎండాడ, అనకాపల్లి జిల్లా రాజుపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాలను చట్టపరంగా కూల్చివేయాలని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖలో కార్యాలయ స్థలానికి ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 అద్దె చెల్లించడానికి 33ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.

News June 21, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలు గురించి ఆయనకు కలెక్టర్ వివరించారు.

News June 21, 2024

గుంటూరు: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

image

స్నేహితులతో సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొక విద్యార్థి గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు శుక్రవారం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడి తీవ్రం కావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాసేపటికే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.

News June 21, 2024

శ్రీకాకుళం: MA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MA కోర్సుల పీజీ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 21, 2024

అతిసార వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడ అతిసార వ్యాధి ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. శుక్రవారం నాడు జరిగిన రాష్ట్రవ్యాప్త కాన్ఫరెన్స్‌లో భాగంగా ఢిల్లీ రావు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలింది అన్న ప్రచారం ఉండకూడదని అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు.

News June 21, 2024

కృష్ణా: LLB రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2023లో నిర్వహించిన LLB కోర్సుల 5, 9వ సెమిస్టర్ల రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 21, 2024

బాపట్ల: హత్యా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి

image

ఈపురుపాలెం గ్రామంలో బహిర్భూమికి వెళ్లి హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు.

News June 21, 2024

డయేరియా నియంత్రణకు చర్యలు: డీకే బాలాజీ

image

జిల్లాలో డయారియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.

News June 21, 2024

విషాదం.. బీచ్‌లో ఏలూరు జిల్లా యువకుల గల్లంతు

image

బాపట్ల జిల్లాలో విషాదఘటన చోటు చేసుకుంది. రామాపురం బీచ్‌‌లో నలుగురు యువకులు స్నానానికి సముద్రంలో దిగగా అలల ఉద్ధృతికి వారంతా కొట్టుకుపోయారు. వారిలో తేజ (21), కిశోర్‌(22) మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు సహాయంతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.