India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు.

వాల్తేరు డివిజన్ దంతేవాడ – కమలూర్ సెక్షన్ మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈరోజు నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నం- కిరండూల్ ఎక్స్ప్రెస్ రైలు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు కిరండూల్- విశాఖ ఎక్స్ప్రెస్ కిరండోల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది.

అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

అసెంబ్లీలో నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

పదవీ విరమణ చేసి కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తక్షణం రాజీనామా చేయాలని ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఓఎస్డీగా పని చేస్తున్న మాజీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణ మోహన్తో పాటు ఫార్మసీ, న్యాయ, సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పరిస్థితి ఏమిటనే సందేహం కలుగుతోంది. వీరంతా రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే చర్చ నడుస్తోంది.

డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డిగా ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయన చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆయన మెుదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగ అన్నారు. పోలీసులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు 15 నిమిషాలు యోగ చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు.

అనంత జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బుకొఠారి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

తొగరం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ పైడి వెంకటరావు గురువారం తెలిపారు. విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని చెప్పారు. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆమె చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆమె బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.