Andhra Pradesh

News June 21, 2024

విశాఖ షిప్ యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవం

image

విశాఖ షిప్ యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. దేశంలో తొలి నౌక నిర్మాణ కేంద్రంగా విశాఖపట్నంలో హిందుస్థాన్ ప్రారంభమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. గత మూడేళ్లుగా సంస్థ లాభాలను చూస్తోంది.. 2021-22లో 51 కోట్ల లాభాన్ని, 2022-23 సంవత్సరంలో 65 కోట్ల లాభాన్ని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 109 కోట్ల లాభాన్ని అర్జించింది.

News June 21, 2024

ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌పై సస్పెన్షన్ ఎత్తివేత..!

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.లావణ్యదేవిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన భర్త అయిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తరఫున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. తాజాగా ఆమె సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News June 21, 2024

నేడు అసెంబ్లీకి నారా లోకేశ్.. ఆయన హామీలివే.!

image

మంగళగిరి MLAగా నారా లోకేశ్ నేడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆయన హామీలివే..
◆మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు
◆ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు
◆నియోజకవర్గంలోని 20వేల మంది పేదలకు పక్కా ఇళ్లు
◆స్వర్ణ కార హబ్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
◆చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపునకు చర్యలు
◆మంగళగిరి, తాడేపల్లి వాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించడం.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి గల్లా మాధవి.. ఆమె హామీలివే.!

image

గుంటూరు వెస్ట్ MLAగా గల్లా మాధవి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆమె హామీలివే..
◆UGD పనులు పునఃప్రారంభం
◆హోటళ్లలో ఆహార కల్తీ నియంత్రణ
◆స్వచ్చ గుంటూరు సాకారానికి సులభ్ కాంప్లెక్సుల నిర్మాణం
◆ప్రీలెఫ్ట్‌తో పాటు పార్కులు అభివృద్ధి
◆కుక్కల బెడదపై చర్యలు
◆రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
◆గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై ఉక్కుపాదం
◆శ్యామల నగర్ RUB, శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి.

News June 21, 2024

నెల్లూరు: ఇంకా తొలగని జగన్ ఫొటోలు

image

ప్రభుత్వం మారడంతో అన్ని చోట్లా మాజీ సీఎం జగన్, మాజీ మంత్రుల ఫొటోలను అధికారులు తొలగించారు. ఎక్కడికక్కడ కొత్త సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మాత్రం జగన్ ఫొటోలు ఇంకా దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఉన్న బిట్-1, 3 సచివాలయ భవనంపై సీఎం జగన్ అంటూ ఆయన ఫొటో, నవరత్నాల లోగో ఇంకా అలాగే ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

News June 21, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

పలాస, శ్రీకాకుళం మీదుగా డిబ్రుగఢ్(DBRG)- కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.నెం .22504 DBRG – CAPE ట్రైన్‌ను జులై 8 నుంచి, నెం.22503 CAPE – DBRG ట్రైన్‌ను జులై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News June 21, 2024

ప.గో.: 329 మంది హాజరు

image

పశ్చిమగోదావరి జిల్లాలోని మహాత్మాజ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపల్, కన్వీనర్ శైలజ తెలిపారు. మొత్తం 434 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 329 మంది హాజరయ్యారని, 105 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

News June 21, 2024

చిత్తూరు: సీఐకు ఏడాది జైలు శిక్ష

image

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు సీఐ మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్ఐగా పని చేశారు. అక్కడ ఘనపురం అనే గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డిని 2015లో విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని పిలిచారు. వారెంట్ ఉంటేనే వస్తానని నరేంద్ర చెప్పగా.. మారుతి కోపంతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐకు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.

News June 21, 2024

ఆమంచిని మెచ్చిన షర్మిల.. ఎందుకంటే?

image

రాష్ట్రం మొత్తం మీద చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా 42 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభినందించారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల అధ్యక్షతన జరిగిన ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశంలో చీరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. ఆమంచి తన సత్తా చాటారని షర్మిల వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కూడా పాల్గొన్నారు.

News June 21, 2024

ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పైనుంచి దూకి సూసైడ్

image

ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ కు చెందిన చాంద్ బాషా (54) జిల్లా ఆసుపత్రి భవనం పైనుంచి బుధవారం అర్ధరాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చాంద్ బాషా టీబీ వ్యాధికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి జిల్లా ఆసుపత్రి 2వ అంతస్తు భవనంపై నుంచి దూకాడు. సిబ్బంది అతనికి వైద్యం అందిస్తుండగా చనిపోయాడు.